RS Praveen Kumar: బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊరట లభించింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలు జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు పార్టీ మారుతున్నారు. కొందరు అధికార కాంగ్రెస్ పార్టీలో, మరి కొందరు బీజేపీ లో చేరుతున్నారు. ఆయా పార్టీలో చేరిన వారికి లోక్ సభ టికెట్ లు కన్ఫర్మ్ అవుతున్నాయి.
ఇలా పార్టీ నేతలు పలువురు షాక్ ల మీద షాక్ లు ఇస్తుండగా, గులాబీ పార్టీకి ఊరట కల్గించే పరిణామం చోటు చేసుకుంది. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవేళ గూలాబీ గూటికి చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఇటీవల బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు పెట్టుకున్నవిషయం తెలిసిందే. దీనిలో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ రెండు లోక్ సభ స్థానాలు పొత్తులో భాగంగా బీఎస్పీకి బీఆర్ఎస్ కేటాయించింది. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ నుండి ప్రవీణ్ కుమార్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు.
అయితే పొత్తును విరమించుకోవాల్సి రావడంతో ఆయన మనస్థాపానికి గురై .. పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరే ముందు ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పరిస్థితుల కారణంగా గులాబీ పార్టీలోకి మారాల్సి వస్తొందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు. ప్యాకేజీ తీసుకునే వాడినైతే అధికార పార్టీలో చేరేవాడినని అన్నారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ప్రవీణ్ ఉండరని అన్నారు.
MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన