MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవేళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకే ఈ నెల 15న కవితను తాము అరెస్టు చేసినట్లు తెలిపారు.
కవితను అరెస్టు చేసే సమయంలో ఆమె బంధువులు ఆటంకం కల్గించారని కూడా పేర్కొన్నారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వందల కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత పాత్ర కీలకమని ఈడీ పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఈ కేసులో ఇప్పటి వరకూ 245 ప్రాంతాల్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ పేరొంది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని వెల్లడించింది.
ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేశామనీ, మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు పలువురు అరెస్టు అయిన వారిలో ఉన్నారని వివరించింది. అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లుగా తేలిందని ఈడీ ప్రకటించింది.
మొత్తం వంద కోట్ల రూపాయలు ఆప్ నేతలకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని వెల్లడించింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలైన అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాలతో కలిసి ఎమ్మెల్సీ కవిత కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడేందని వివరించింది.
BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు