BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వారు కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం తీసుకుని కారు పార్టీ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు బీఆర్ఎస్ నేతలు పిటిషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సోమవారం స్పీకర్ ను ఆయన నివాసంలో కలిసి అనర్హత పిటిషన్ సమర్పించారు. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని సభాపతి తమకు హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ నాయకురాలు దీపాదాస్ మున్షీ, సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరుల సమక్షంలో దానం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.