ఈసారి తెలంగాణలో ఎన్నికలు హోరాహోరిగా జరగనున్నాయి. మరి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలలో పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే రాజధానిలో అంతర్భాగంగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు సీటు రేసు రసవత్తరంగా మారింది. ఈ ఎంపీ సీటు కోసం అధికార కాంగ్రెస్ – ప్రతిపక్ష బీఆర్ఎస్, బిజెపి నేతల నుంచి దిగ్గజాలు పోటీపడుతున్నారు. బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పోటీ చేయటం ఖాయం. ఎప్పటికే ఆయన పేరు కూడా ఖరారు అయింది. ఆయనకు సికింద్రాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ఎవరు ప్రత్యర్థులుగా ఉంటారు అన్న విషయంలో నిన్న మొన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.
కానీ ఇప్పుడు గ్రేటర్ పరిధిలో కీలక నేతలుగా ఉన్న వారే అక్కడ పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ప్రస్తుతం ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్, బిఆర్ఎస్ తరఫున మాజీ మంత్రి ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో సికింద్రాబాద్ పోరు హెరాహోరీగా సాగనుంది. సికింద్రాబాద్ నియోజకవర్గం చాలాసార్లు బిజెపికి కంచుకోటగా ఉంటూ వస్తుంది. గతంలో ఇక్కడ రెండుసార్లు బిజెపి గెలిచింది. మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. ఆ తర్వాత 2019 ఎన్నికలలో కిషన్ రెడ్డి ఇక్కడ ఎంపీలుగా గెలిచారు.
అయితే సికింద్రాబాద్లో మజ్లిస్ పోటీ చేస్తే బిజెపికి తిరుగులేని విజయం దక్కుతుంది. కానీ గతంలో బిఆర్ఎస్ తో ఉన్న అవగాహన మేరకు మజ్లిస్ పోటీ చేయలేదు. ఈసారి కాంగ్రెస్తో మజిలీ ఆ మేరకు అవగాహన పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన చేయటంలోనే చాలా ప్రత్యేకమైన వ్యూహం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తన కుమారుడికి సీటు కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికలలో తలసాని కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ ఇక్కడ నుంచి పోటీ చేసి కిషన్రెడ్డి చేతిలో 60 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అయితే ఈసారి కూడా తన కుమారుడికి సికింద్రాబాద్ పార్లమెంటు సీటు ఇప్పించుకునేందుకు శ్రీనివాస్ యాదవ్ విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే హై కమాండ్ మాత్రం తలసానినే బరిలోకి దించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆరు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక నాంపల్లిలో మాత్రమే మజిలీస్ గెలిచింది. ఈ 6 నియోజకవర్గాలలో దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్న ఖైరతాబాద్, తలసాని శ్రీను ఎమ్మెల్యేగా ఉన్న సనత్ నగర్ కూడా ఉన్నాయి.
విచిత్రమైనటువంటి ఈసారి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఒక బీఆర్ఎస్ నుంచి మరొకరు కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేయటం ఖాయం అయినట్టే. అటు కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గ అంబర్ పేట ఉన్న గత ఎన్నికలలో అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. ఇక నాంపల్లిలో మజిలీస్ ఎమ్మెల్యే ఉన్నారు. ఈసారి ఓస్లిం మోటర్ల మద్దతు కాంగ్రెస్కు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో నాంపల్లిలో మజ్లిస్ గెలిచినా అక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవడంతో పాటు గట్టి పోటీ ఇచ్చింది. ఏది ఏమైనా ఈసారి ఎలా చూసినా కిషన్ రెడ్డి గెలుపు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో అంత ఈజీ కాదని రాజకీయ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.