Malli Nindu Jabili April 17 2024 Episode 625:అరవింద్ వచ్చిన దగ్గరి నుండి మన గురించి మర్చిపోతున్నాం మనకు ఒక జీవితం ఉందని మర్చిపోతున్నావు వాళ్ల గురించి ఆలోచిస్తున్నావు అని గౌతమంటాడు. మాలిని అరవింద్ బాబులతో సీతారాముల కళ్యాణం చేయిద్దామని మొక్కుకున్నాను అని అంటుంది మల్లి. ఈ సీతారాములు మిమ్మల్ని క్షమించేలా చేశారు. అరవింద్ నన్ను క్షమించలేదు మల్లి అలా క్షమించినట్టు నటిస్తున్నాడు నిరూపించడానికి నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని అనుకుంటాడు గౌతం. ఇకనుంచి మన రెండు కుటుంబాలు దూరంగా ఉండడం మంచిది అని నాకు అనిపిస్తుంది అని అంటాడు గౌతమ్. మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మీ మనసులో ఏమైనా ఉంటే చెప్పండి అని అంటుంది మల్లి.
బంధాలు బంధుత్వాలు వద్దనుకునే మీ ఆలోచన మంచిది కాదు దయచేసి మీరు నాకు అడ్డుపడకండి అని వెళ్ళిపోతుంది మల్లి. గౌతమ్ ఒక టీ షాప్ దగ్గరికి వెళ్లి టీ తాగుతూ ఉంటాడు. గౌతమ్ మల్లి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అరవింద్ వస్తాడు. మల్లి అరవింద్ మనసులో ఏముందో తెలియక ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలనుకుంటుంది నా మీద ద్వేషంతోనేఅరవింద్ మల్లికి దగ్గరవుతున్నాడు మల్లి ఇంతకుముందు నా గురించి ఆలోచించేది నేను అరవింద్ ని ఎటాక్ చేయించానని అరవింద్ సింపతి ఎక్కువైంది అని గౌతం అనుకుంటాడు.
అరవింద్ ని చూసిన గౌతమ్ షాక్ అవుతాడు.అరవింద్ కూడా అక్కడ టీ తాగుతూ ఉంటాడు. రోజు ఇక్కడికి వచ్చి తాగుతావా లేదంటే అప్పుడప్పుడు వస్తావా అని అడుగుతాడు అరవింద్. అప్పుడప్పుడు వస్తుంటాను అని చెప్తాడు గౌతం. ఎందుకింత కంగారు పడుతున్నావు ఈ కంగారు నేరం చేయకముందు ఉండాలి అని అరవింద్ అంటాడు. టీ తాగి అరవింద్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అరవింద్ మాలినికి గోరింటాకు పెడుతూ ఉంటాడు. శంకరమ్మ అది చూసి వసుంధరని బయటికి తీసుకొస్తుంది.
అది చూసి సంతోషిస్తుంది వసుంధర. ఇంతలో అరవింద్ కి మల్లి ఫోన్ చేస్తుంది.అది చూసి మల్లి ఎందుకు ఈ టైం లో చేస్తుంది అని అనుకుంటుంది వసుంధర. ఫోన్ తీసుకెళ్లి అరవింద్ కి ఇస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేసావ్ మల్లి అని అడుగుతాడు అరవింద్. మీ ఇద్దరితో సీతారాముల కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను మీ ఇద్దరు రేపు రావాలి అని అంటుంది మల్లి. అందరిని తప్పకుండా రమ్మనండి అని మల్లి ఫోన్ కట్ చేస్తుంది. మల్లి రేపు మనందరినీ గుడికి రమ్మని అంటుంది అని అంటాడు అరవింద్. మీరు రేపు అక్కడికి వెళ్లడం నాకు ఇష్టం లేదు మన ఇంట్లోనే పూజ జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళకండి అని వసుంధర. నేను చచ్చిపోయినప్పుడు తను ఒక్కతే నేను బ్రతికున్నానని నమ్మింది నాకోసం మొక్కుకుంది అందరం కలిసి వెళ్దాం ఒప్పుకోండి అత్తయ్య అని అంటాడు అరవింద్.
సీతారాముల కళ్యాణం జరిపించడం ముఖ్యం కదా వెళ్దాం లే అని అంటుంది మాలిని.మల్లి వాళ్లు గుడికి వస్తారు. ఇంతలో మాలిని అరవిందు వాళ్ళు కూడా వచ్చేస్తారు. నా కూతురు నా అల్లుడుతో నా ఇంట్లో నేను కళ్యాణం చేయించాలి అనుకున్నాను నువ్వు ఏదో మొక్కు మొక్కావని దాన్ని ఈరోజు తీర్చుకోవాలి అనుకున్నావని అరవింద్ చెప్తే అందరం గుడ్డిగా నమ్మి వచ్చాం ఇక ఇక్కడి నుంచి నువ్వేం చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది అని అంటుంది వసుంధర. మల్లి ఉద్దేశం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది వసుంధర అది ఎదుటి వాళ్లు అర్థం చేసుకునే దాన్నిబట్టి ఉంటుంది అని అంటాడు
శరత్.గౌతమ్ నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు వెళ్దామా అని అంటాడు అరవింద్. ఏంటో చెప్పు అని అంటాడు గౌతం.అందరూ సీతారాముల దగ్గరికి వెళ్లి ఉంటారు.పంతులుగారు కళ్యాణం చేసే దంపతులను కూర్చోమని చెబుతారు. అరవింద్ నా తోడబుట్టిన గౌతమ్ తో నేను ఒకసారి మాట్లాడాలి అని అందరితో అంటాడు. అందరి దృష్టిలో రాముడి కావచ్చు కానీ నా దృష్టిలో మాత్రం రావణాసురుడివి అందుకే ఈ రావణాసురుడి అంతం ఈ గుడి నుంచే మొదలు కాబోతుంది అని అంటాడు అరవింద్.