Ranneeti web Series Trailer: పుల్వామా దాడి, తరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇండియా చేసిన దాడుల ఆధారంగా ఇటీవల బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక తాజాగా ఈ నేపథ్యంలోనే ఓ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ పేరు ” రణ్నీతి “. జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న ఈ కొత్త సిరీస్ తెలుగులోనూ రాబోతుంది. బాలీవుడ్ నటీనటులు జిమ్మీ పెర్గిల్,లారా దత్తా నటించిన వెబ్ సిరీస్ నే ఈ సిరీస్.
ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా బుధవారం అనగా ఏప్రిల్ 17 ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సంతోష్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ వార్ డ్రామా సిరీస్ ఎలా ఉండబోతుందో ట్రైలర్ కళ్లకు కట్టినట్లు చూపించింది. పుల్వామా దాడి, ఆ తరువాత పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఇండియా జరిపిన మెరుపు దాడుల వెనుక అసలు ఏం జరిగింది? ఈ దాడులపై పాకిస్తాన్ రియాక్షన్, అంతర్జాతీయ వేదికలపై వాళ్లు ముసలి కన్నీరు లాంటి అంశాలన్నిటిని ఈ ఈ సిరీస్లో చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ తో అర్ధమైంది.
ట్రైలర్ లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టంట్స్ నువ్వు కూడా చూపించారు. ” ఈ కథ మీకు తెలుసు. కానీ ఈ యుద్ధం మీకు తెలియదు. ఇండియా చేసిన ఈ చరిత్రక ఆధునిక యుద్ధం గురించి తెలుసుకోండి. రణ్నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ ట్రైలర్ వచ్చేసింది ” అనే క్యాప్షన్ తో జియో మూవీ ఈ ట్రైలర్ను షేర్ చేసింది. ఈ సిరీస్ హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లోనూ స్రీమింగ్ కానుంది.
రాణ్నీతి సిరీస్లో లారా దత్తా, జిమ్మి షెర్గిల్ ప్రధాన పాత్రలో నటించారు. గతంలో తాను ఎప్పుడూ పోషించని పాత్ర ఇది అని జిమ్మీ చెప్పు కొచ్చారు. యుద్ధం వెనుక వార్ రూమ్ లో జరిగిన ఘటనలను కళ్ళ కట్టినట్లు ఈ సిరీస్తో చూపించండి అన్నారు. ఇక ఈ సిరీస్ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇక ఈ సిరీస్ కనుక సూపర్ హిట్ అయితే వీటికి సీక్వెల్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది.