Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో “ఖుషి” మూవీ బిగ్గెస్ట్ హిట్స్ అని అందరికీ తెలుసు. 2001లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ స్టార్ డామ్ అమాంతం పెంచేసింది. 2001 ఏప్రిల్ 26వ తారీకు ఈ సినిమా విడుదల అయింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మించారు. సరిగ్గా ఈ సినిమా విడుదలైన 22 సంవత్సరాల తర్వాత నిర్మాత ఏఎం రత్నం ఇప్పుడు.. పవన్ కళ్యాణ్ తో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల నుండి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల చేస్తున్నట్లు సినిమా యూనిట్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. “మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో..” అంటూ పవన్ కళ్యాణ్ ఫోటోతో ఈ పోస్టర్ ను రూపొందించారు. శ్రీరామనవమి సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లు, గ్లింప్స్… వీడియోలు పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొగలుల సామ్రాజ్యకాలం నాటి.. కథతో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఏప్రిల్ 26వ తారీకు అనగా “ఖుషి” సినిమా రిలీజ్ అయిన రోజు… విడుదల చేయాలని నిర్మాత ఏఎం రత్నం డిసైడ్ అయినట్లు టాక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంక నెలరోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత సంవత్సరం చివరి నుండే సినిమా షూటింగ్స్ కి పవన్ కళ్యాణ్ బ్రేక్ ఇవ్వటం జరిగింది. “హరిహర వీరమల్లు” షూటింగ్ దాదాపు 80 శాతం అయిపోయింది. కొద్దిపాటి షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎలక్షన్స్ అయిన వెంటనే.. దాన్ని కంప్లీట్ చేయనున్నట్లు టాక్.