అమరావతి: వైసిపి నేతల శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనబడుతున్నదని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అంటూ సాక్షి ఛానల్లో చేసిన ప్రసారంపై ఆయన మండిపడ్డారు. దీనిపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అవుట్ హౌస్లోకి నీళ్లు వస్తే చంద్రబాబు నివాసంలోకి వరద నీరు అంటూ అవుట్ హౌస్ ఫోటో పెట్టి కథనం రాసిందని పేర్కొన్నారు. హై సెక్యూరిటీ కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి అవుట్ హౌస్లో ఉంటారా అని ప్రశ్నించారు. అయినా అవుట్ హౌస్కు చంద్రబాబు నివాసానికి ఎంత దూరం ఉందో చూడండి అంటూ లోకేష్ ఆ ఫోటోను ట్యాగ్ చేశారు.
వైసీపీ నేతల శాడిజం అంతా సాక్షి పైశాచిక రాతల్లో కనపడుతుంది. చంద్రబాబుగారి నివాసంలోకి వరదనీరు అంటూ అవుట్ హౌస్ ఫోటో పెట్టి కథనం రాసింది సాక్షి. హై సెక్యూరిటీ కలిగిన ఒక మాజీ ముఖ్యమంత్రి అవుట్ హౌస్ లో ఉంటారా? అయినా అవుట్ హౌస్ కు చంద్రబాబుగారి నివాసానికి మధ్య ఎంత దూరం ఉందో చూడండి. pic.twitter.com/jBzvP8yxcW
— Lokesh Nara (@naralokesh) August 16, 2019