Anantapur: అనంతపురం రూరల్ మండలం పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఆలమూరు పంచాయతీలోని ఆలమూరు 1,2 అంగన్ వాడీ కేంద్రంలో, రుద్రపేట పంచాయతీ లోని చంద్రబాబు నగర్ 3లో జన భాగీదారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్ వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. ఈ విషయంలో తల్లులతో చర్చించారు.
అంగన్ వాడీ కేంద్రాలకు పంపించడం వల్ల పిల్లలలో శారీరక అభివృద్ధి, జ్ఞాపక శక్తి మరియు తెలివితేటలు వికసింప జేసుకుంటారని చెప్పారు. ప్రాధమిక విద్యను పిల్లలకు ఇష్టమైన ఆట పాటలు కథల ద్వారా వారి మనసును హత్తుకునేలా అంగన్ వాడీ కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. అంగన్ వాడీలో కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ ధనలక్ష్మి, సూపర్ వైజర్ జయశ్రీ, అంగన్ వాడీ కార్యకర్తలు పద్మజ, నాగరాణి, ప్రమీల, శ్రీదేవి, కవిత, అంగన్ వాడీ హెల్పర్లు పాల్గొన్నారు.