Jayasudha: సహజ నటి అనగానే తెలుగువారికి మొదట గుర్తుకు వచ్చే నటి జయసుధ. మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించిన జయసుధ.. లెజెండరీ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మలకు స్వయానా మేనకోడలు. కేవలం 13 ఏళ్ల వయసులోనే సినీ గడప తొక్కిన జయసుధ.. 1972లో పండంటి కాపురం మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే జయసుధ నటిగా మంచి మార్కులు వేయించుకుంది. మరిన్ని అవకాశాలను అందుకుంది. 1973లో కె. బాలచందర్ దర్శకత్వంలో అరంగేత్రం సినిమాలో నటించి తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అటు పిమ్మట బాలచందర్ దర్శకత్వంలో తెలుగు మరియు తమిళ భాషల్లో అనేక సినిమాల్లో జయసుధ నటించింది. తనదైన అందం, అభినయంతో అగ్ర హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. సహజ నటిగా పేరు తెచ్చుకుంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు తరాల హీరోలతో జతకట్టిన నటీమణుల్లో జయసుధ ఒకరు. కెరీర్ ఆరంభంలో నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ వంటి హీరోలకు జోడిగా నటించన జయసుధ.. ఆ తర్వాత మోహన్ బాబు, చిరంజీవి, మురళీమోహన్ వంటి దిగ్గజ హీరోలతో జతకట్టారు.
అలాగే తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో హీరోయిన్ గా పని చేశారు. కాంచన సీత, కలికాలం, మేరా పతి సిర్ఫ్ మేరా హై, అద్రుస్తమ్ వంటి పలు చిత్రాలను జయసుధ నిర్మించారు. హీరోయిన్గా ఫేడౌట్ అయ్యాక సహాయక నటిగా మారారు. తల్లి పాత్రలకు కేరాఫ్ గా మారారు. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి చిత్రంలో అనుష్క మదర్ గా నటించి ఆకట్టుకున్నారు. వయసు రిత్యా ప్రస్తుతం ఆమె పరిమితంగా సినిమాలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ టాలీవుడ్ లో తనుకు ఇద్దరూ అన్నయ్యలు ఉన్నారంటూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు.
ఇంతకీ జయసుధ అన్నయ్యలు మరెవరో కాదు.. ఒకరు మురళీ మోహన్ కాగా మరొకరు మోహన్ బాబు. `తెలుగు చిత్ర పరిశ్రమలో తాను సొంత ఫ్యామిలీ గా కొంత మందిని మాత్రమే భావిస్తాను. కుటుంబం అంటే కుటుంబమే.. నా కుటుంబంలో ఇండస్ట్రీ నుంచి మోహన్ బాబు, మురళీ మోహన్ మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరు హీరోలు నన్ను ఎంతో ఆప్యాయంగా చెల్లమ్మ అని పిలుస్తారు. వారిని అన్నయ్య అని పిలవడం నాకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఇండస్ట్రీలో వారిద్దరినీ మినహా మరెవ్వరినీ తాను అన్నయ్య, అక్క అని వరసలు పెట్టి పిలవను` అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ చెప్పుకొచ్చారు. దీంతో జయసుధ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, జయసుధ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మొదటి ఆమె సినీ నిర్మాత వడ్డే రమేష్ బావమరిది కాకర్లపూడి రాజేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరి వివాహ బంధం విడాకులతో ముగిసింది. 1985లో నటుడు జీతేంద్రకు బంధువు మరియు నిర్మాత నితిన్ కపూర్ను జయసుధ రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నిహార్, శ్రేయాన్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. 2017లో నితిన్ కపూర్ బైపోలార్ డిజార్డర్తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నారు.