Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజయవంతంగా ప్రసారమవుతుంది. ఇప్పటివరకు ఎనిమిది వారాలు ఆట కంప్లీట్ కావడం జరిగింది. ఈ యెనిమిది వారాలలో ఎవరు ఊహించని రీతిలో సీజన్లో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డు ఎంట్రీలో ఐదుగురు సభ్యులు హౌస్ లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ ఐదుగురిలో భోలే పేరు ఎక్కువగా వినబడుతుంది. సింగర్ కావటంతో హౌస్ లో భోలే ఆడుతున్న ఆట తీరు చేస్తున్న కామెడీ చూసే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. ఈ క్రమంలో అతి తక్కువ కాలంలోనే భోలే.. కొంతమంది కంటెస్టెంట్ల మధ్య బద్ధ శత్రుత్వం ఏర్పడింది.
ముఖ్యంగా ఏడో వారం నామినేషన్స్ లో భాగంగా ప్రియాంక జైన్- భోలే షావలి- శోభా శెట్టి మధ్య గట్టిగానే మాటలు యుద్ధం నడిచింది. ఇక తర్వాత ఎనిమిదో వారంలోనే ఈ ముగ్గురి మధ్య మాటల తూటాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ క్రమంలో నామినేషన్ సమయంలో శోభా శెట్టి భోలేపై ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ‘నీ బతుకు.. నువ్వు తినేది అన్నమేనా? నువ్వు అసలు మనిషివేనా? సిగ్గు ఉండాలి.. బుద్దిలేదు నీకు.. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది’ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది. అలా శోభ, ప్రియాంకే కాదు సీరియల్ బ్యాచ్ మొత్తం భోలేను టార్గెట్ చేసి నామినేట్ చేశారు.
అయితే ఈ గొడవపై భోలేషావలి తల్లి ఇప్పటికే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందే. తాజాగా భోలే సోదరి బిగ్ బాస్ గొడవలపై స్పందించింది. శోభా శెట్టి, ప్రియాంక జైన్ తన అన్నయ్యను నోటికొచ్చినట్లు మాట్లాడటం చాలా బాగా కలిగించిందని తెలిపారు. మా అన్నయ్యకి ఇతరులకు సాయం చేయడం తప్పితే.. గొడవలు పడటం రాదు. తనని ఎంత అసహ్యించుకున్న గాని తిరిగి ప్రేమించటం.. మా అన్నయ్య మనస్తత్వం. ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం మా అన్నయ్యకు పెద్దగా తెలియదు. అటువంటిది మా అన్నయ్యను శోభా శెట్టి మరియు ప్రియాంకలు దారుణంగా అవమానించడం చూస్తుంటే.. నా రక్తం మండిపోతుంది అంటూ… భోలే.. సోదరి సీరియస్ అయింది.