Malli Nindu Jabili January 26 2024 Episode 556: అరవింద్ బాబు గారికి క్షేమంగానే ఉండుంటారు ముందు ఆయనకు ఏమైందో తెలుసుకోండి మా ఆయన ఎందుకు చంపుతారు అని అంటుంది మల్లి. పూర్తిగా నిర్ధారణ చేసుకొని వస్తాను అప్పుడు ఇద్దరిని చంపేస్తాను అని అంటుంది వసుంధర. సుందర వెళ్ళిపోతూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి చంపిన వాడు దొరికిన తర్వాత నేనే చంపేస్తాను అని అంటుంది. మల్లి పరిగెత్తుకుంటూ దేవుడి గుడి దగ్గరికి వెళ్లి, అరవింద్ బాబు గారికి ఏమి జరుగి ఉండదు వసుంధర అమ్మ చెప్పింది నిజం కాదు ఆయన క్షేమంగానే ఉండుంటాడు అరవింద్ బాబు ఎక్కడున్నావో అలా కళ్ళ ముందుకు వచ్చేలా చూడు స్వామి అరవింద్ బాబు మంచోడు ఎవరికి హానీ చేయడు ఎవరిని చంపడు అని మల్లి అరుస్తుంది. నీ నమ్మకం నిజం అవుతుంది మల్లి అరవింద్ కి ఏమి జరిగి ఉండదు అని గౌతమ్ అనగానే మల్లి కలుగరికి కింద పడుతుంది. శరత్ అరవింద్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అరవింద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడేమో అని అడుగుతాడు.
ఇంతలో వసుంధర అక్కడికి వస్తుంది. గౌతమ్ మల్లి ఈ రోజు నా చేతిలో చచ్చేవాళ్లు గౌతమ్ అరవింద్ ని చంపేసుంటాడు అని వసుంధర అంటుంది. అరవింద్ కి ఏమి జరిగి ఉండదు ఇంకోసారి అలాంటి మాటలు ఎవరు మాట్లాడకండి అని ఏడుస్తుంది మాలిని. అరవింద్ లేడని మీరు నిర్ధారణకు రాకండి నిజాలు తెలిసే వరకు అలాంటివి మాట్లాడకండి. ఇంతలో పోలీసులు వసుంధర వాళ్ళ ఇంటికి వస్తారు. అరవింద్ కారుని చూసి మాలిని అరవింద్ వచ్చేసాడు అనుకుంటుంది కానీ అందులో నుంచి పోలీసులు వస్తారు. పోలీసులను చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎవరోగుర్తు తెలియని వ్యక్తులు అరవింద్ ని చంపేశారు అని మాకు న్యూస్ వచ్చింది అని చెప్తాడు పోలీస్. పంపిన తర్వాత నీళ్లలో పడేసినట్టు మాకు సమాచారం అందింది ఈ విషయం మీకు పొద్దున చెబుదామని అనుకున్నాను కానీ కొన్ని వివరాలు సేకరించే పనిలో పడి రావడం ఆలస్యం అయింది అని అంటాడు ఎస్సై. నిందితులెవరో అనేది తెలియకపోతే ఎలా సార్ అని అంటారు శేఖర్.
ఆ ఏరియాలో సిసి కెమెరాలు లేవు సార్ అందుకనే మేము ఎవరిని అనుమానించలేకపోయాం అని అంటాడు ఎస్సై. నిందితుడు గురించి మీ ప్రయత్నం మీరు చేయండి మా ప్రయత్నం మేము చేస్తాం అని అంటుంది వసుంధర. వర్క్ దగ్గర కానీ పర్సనల్ గా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని మాకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అని అంటాడు ఎస్సై. మీరు తొందరగా వచ్చి కంప్లైంట్ ఇస్తే మా ఇన్వెస్టిగేషన్ తొందరగా జరుగుతుంది నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాము అని అంటాడు ఎస్సై. పోలీసులు వెళ్లిపోతారు. మీరా ఇదంతా నీ అల్లుడు వల్లనే జరిగింది అని అంటుంది వసుంధర. వాడిని నేను వదిలిపెట్టను అని కోపంగా అంటుంది వసుంధర.మాలిని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.మీరా దగ్గరికి రాబోతుంటే వసుంధరనా బిడ్డ మీద నీ నీడ పడడానికి వీల్లేదు ఇంకొకసారి నా బిడ్డ వైపు రాకు అని అంటుంది వసుంధర. మల్లి గౌతమ్ గుడిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వసుంధర అమ్మగారు అంటే అంటారు మనం వెళ్లి మాలిని అక్కని చూసి వద్దామని మళ్లీ గౌతమ్ తో అంటుంది.
గుడికి వచ్చి గన్ పెట్టి బెదిరించి మాట్లాడింది ఇప్పుడు తన దగ్గరికి వెళ్తే ఊరుకుంటుందా అని అంటాడు గౌతమ్. ఇంతలో గౌతమ్ కి మీరా ఫోన్ చేస్తుంది. వసుంధర అమ్మగారు మేము ఎక్కడున్నామో ఎలా తెలుసుకుందో తెలియదు కానీ అరవింద్ బాబు చనిపోయారని నా భర్త చంపాడని అతనిని చంపబోయింది నాకేం అర్థం కావడం లేదు నేను నీకు ఫోన్ చేద్దామనుకున్నాను అని అంటుంది మల్లి. అరవింద్ బాబు గారి విషయంలో ఇందాకటి వరకు అందరం అయోమయంగానే ఉన్నాము ఇందాకనే పోలీసులు వచ్చి అరవింద్ బాబు గారు చనిపోయారుచెప్పారు అని అంటుంది మీరా. శంకరమ్మ అనే ఆవిడ కొన్ని ఆధారాలు చూపించినట్టు పోలీసులు కూడా ఆధారాలు చూపించారు అరవింద్ బాబు గారు ఇక మనకు లేరు అని అంటుంది మీరా. నువ్వు అలా మాట్లాడకు అమ్మ అరవింద్ బాబు గారికి ఏమి జరిగి ఉండదు అలా మాట్లాడకు అని అంటుంది మల్లి.
అరవింద్ బాబు గారు లేరనే నిజం మనము నమ్మక తప్పదు ఆ వార్త వినగానే మాలిని కుప్పకూలిపోయింది మాలినమ్మ గారిని హాస్పిటల్కి తీసుకువెళ్లిపోయారు అని అంటుంది మీరా.మేము కూడా హాస్పిటల్ కి వెళ్తామని ఫోన్ కట్ చేస్తుంది మల్లి. వసుంధర అమ్మగారు చెప్పింది నిజమేనండి అరవింద్ బాబు గారు చనిపోయారు అంట పోలీసులు వచ్చి చెప్పారంట అని అంటుంది మల్లి. పొరపాటు జరిగింది అనుకున్నాను వసుంధర అమ్మగారు ఏదో వినేసి ఆవేశంలో మన దగ్గరికి వచ్చారు
అనుకున్నాను బాబు గారికి ఎలాంటి హాని జరగకూడదని మనసులో మొక్కుకుంటూనే ఉన్నాను ఇంత ఘోరం జరిగిపోయింది ఏంటండీ అని మల్లి ఏడుస్తుంది. మల్లి గౌతమ్ కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. ఎందుకొచ్చావ్ బయటికి వెళ్లిపో అని అంటుంది వసుంధర. అక్కకి ఎలా ఉంది ఒకసారి చూసి వస్తాను అని అంటుంది మల్లి. మేమిద్దరం ఒక తల్లికడుపున పుట్టకపోయినా అక్క చెల్లెలమే అని అంటుంది మల్లి. ఎందుకు అలా మాట్లాడతారు ఒకసారి వెళ్లి చూసి రానివ్వండి అని అంటాడు గౌతం.