Nindu Noorella Saavasam December 21 2023 Episode 112: నాకు మనశ్శాంతి నిద్ర కరువు చేసి ఆయన చూడు హాయిగా నిద్రపోతున్నాడు అని భాగమతి అంటుంది. అయ్యో మిస్సమ్మ తాళం దొరికే దాకా నువ్వు ఆ గదిలోనే ఉండాలి ఏం చేయాలి అని అంటుంది అరుంధతి. నీ పతి దేవుడు శ్రీరామచంద్రుడు అంటివి కదా బాలిక ఇక్కడ ఏమి చేయుచుంటివి అని గుప్తా అంటాడు. అవును నా భర్త శ్రీరాముడు కంటే గొప్పవాడు చూడు ఆయన వేరే సోఫాలో పడుకున్నాడు అని అరుంధతి అంటుంది. అటులైన పిమ్మట ఇక్కడ ఎందుకు వేసిచుంటివి అని గుప్తా అంటాడు. అంటే మిస్సమ్మ గదిలో ఒక్కతే ఉంది కదా భయపడుతుందేమోనని చూస్తున్నాను అని అరుంధతి అంటుంది. నీ పతి దేవుడు కూడా గదిలోనే ఉన్నాడు కదా అందులకు చూచుచుంటివేమో అది ఏ కదా నీ చింతకు కారణము అని గుప్తా అంటాడు. ఏం చెప్పాలో అర్థం కాక అరుంధతి ఆలోచిస్తుంది.
ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి స్వామి వెళ్లి పడుకోండి అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, స్వామి నేను అనుకున్న కార్యం చేయలేకపోతున్నాను ఒక మానవ కన్య వల్ల నేను ఆ ఆత్మ ని బంధించలేకపోతున్నాను నాకు విజయం చేకూరే మార్గం చూపించండి స్వామి అని ఘోర అంటాడు. ఘోర నువ్వేనా ఇంత ఆవేశ పడుతున్నది నీలో శాంతి ఓర్పును చూసే కదా నువ్వు ఏదైనా సాధించగలరని మంత్ర తంత్ర విద్యలు నీకు నేర్పించితిని ఇన్నాళ్ళని నిరీక్షణ ఇప్పుడు ఏమైపోతుంది ఆవేశంతో ఏది చేయలేవు ఘోర ఎప్పుడూ ఆత్మను బంధించాలని పూజలు చేసి విఫలమయ్యే వాళ్ళను చూశాను కానీ నువ్వు అలా కాకూడదు అని నా ఆశ నువ్వు ఆత్మను బంధించి సృష్టిలో నీకు ఎదురులేని వాడిగా నిలిచిపోతావు ఘోర అని వాళ్ళ స్వామి అంటాడు. నేను ఎందుకు ఆ ఆత్మ ని బంధించలేకపోతున్నాను నాకు అడ్డం వచ్చేది ఎవరు అని ఘోర అంటాడు. రేపు ఆ ఇంటి మనసులు నీకు సహాయం చేయడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తారు వాళ్ల సహాయంతో ఆత్మని బంధించి ముల్లోకాలలో నిన్ను మించిన వాడు లేడని నిరూపించు ఘోరా అని వాళ్ల స్వామి అంటాడు. ఆ ఇంట్లో వాళ్లకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు స్వామి నాకు ఎందుకు సహాయం చేస్తారు వాళ్ళుకు కావాల్సింది ఏంటి అని ఘోర అంటాడు.
నిన్ను సహాయం చేయమని అడగడానికి వస్తారు కానీ నీకు సహాయం చేసి వెళ్తారు అని అతను అంటాడు.నన్ను ఆశీర్వదించండి స్వామి అని ఘోర అంటాడు. ఇష్టకామ్యా ఫల సిద్ధిరస్తు విజయ మస్తు అని వాళ్ళ స్వామి ఆశీర్వదిస్తాడు. కట్ చేస్తే, అమరేంద్ర లేచి బాగమతి పడుకున్న బెడ్ మీద వచ్చి పడుకుంటాడు. తను నిద్దట్లో అమరేంద్ర మీద చేయి వేస్తుంది. ఆ చెయ్యి తీసి తన మీద పెట్టి మళ్ళీ పడుకుంటాడు అమరేంద్ర. మళ్లీ భాగమతి చెయ్యి అమరేంద్ర మీద వేస్తుంది. మళ్లీ చేయి తీసి తన మీద పెడదామనుకునేసరికి భాగమతి కళ్ళు తెరిచి చూస్తుంది. తను ఏమీ మాట్లాడట్లేదని తన చేయి రెండు చేతులతో పట్టుకొని నులుముతూ ఉంటాడు అమరేంద్ర. తను మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోవడం చూసి బెడ్ షీట్ కప్పుకుంటాడు అమరేంద్ర ఇంతలో మనోహరి నో అలా జరగకూడదు అని గట్టిగా అరుస్తుంది. అమ్మగారు ఏమైందమ్మా అని నీలా అంటుంది. నో అలా జరగకూడదు అని కంగారుపడుతూ అంటుది మనోహరీ. ఏంటమ్మా అమరేంద్రయ్య గారి గురించి కల వచ్చిందా అని నీలా అంటుంది. ఏంటే నేను వాళ్ల గురించి కలకన్నానని నీకు ఎలా తెలుసు అని మనోహరి అంటుంది. నీ కళ్ళల్లో భయం మొహం మీద చెమట మాటల్లో వణుకు చూస్తుంటే ఇంకెవరి గురించి మీరు కలగంటారమ్మా పైగా అమరేంద్ర అయ్యగారు మిస్సమ్మ ఓకే గదిలో ఉన్నారు అని అంటుంది నీల.
అమ్మగారు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం బాగుంటుంది ఒకసారి వెళ్లి చూడండి అని అంటుంది నీలా. మనోహరి కంగారు పడుతూ గబగబా పరిగెత్తికెళ్ళి డోర్ తీద్దామని చూస్తుంది డోర్ పగలకొట్టొద్దు అన్నాడు కదా అమరేంద్ర అని కిటికీ నుంచి చూసిఊపిరి పీల్చుకుంటుంది మనోహరి. వాళ్ళిద్దరూ ఎక్కడ పడుకున్నా వాళ్ళుని అక్కడ చూసి మనోహరి ఏదైతే అదే అయింది రేపు రాథోడ్ మేకర్ ని తీసుకురాకపోతే డోర్ బద్దలు కొట్టేస్తాను అని అంటుంది మనోహరి. ఏమిటో ఈవిడ సొంత భార్య కంగారు పడిపోయినట్టు వచ్చి చూసి వెళ్ళిపోయింది నిద్రంతా పాడు చేసింది ఈవిడ ప్రవర్తనే అర్థం కాదు అంటుంది నీలా . కట్ చేస్తే,ఇంతలో తెల్లవారిందిరామ్మూర్తి స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుంటాడు.మంగళ కూర్చోండి టిఫిన్ పెడతాను వేడివేడిగా అని అంటుంది. ఏంటే ఇంత పొద్దున్నే షాకింగ్ ఇస్తున్నావ్ పొద్దున లేచేసరికి బాత్రూంలో వేడి నీళ్లు పెట్టావ్ ఇప్పుడు ఏమో వేడివేడిగా టిఫిన్ పెడుతున్నావ్ నీకేమైంది బాగానే ఉన్నావా అని రామ్మూర్తి అంటాడు.ఏమండీ మీరు మా కోసం ఆరోగ్యం బాగో లేకపోయినా డ్యూటీ చేస్తున్నారు నేను ఈ మాత్రం చేయలేనా అని వాళ్ళ తమ్ముణ్ణి పిలిచి బట్టలు తీసుకు రమ్మంటుంది మంగళ.
వాళ్ల తమ్ముడు బట్టలు ఇస్తిరి చేసి తీసుకువచ్చి ఇస్తాడు. నిజంగానే మీ ఇద్దరికీ పిచ్చి పట్టినట్టుంది నిన్నటి నుంచి చూస్తున్నాను మీ ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది అని రామ్మూర్తి అంటాడు. ఏమండీ మా కోసం మీరు ఇంత కష్టపడుతుంటే మా తమ్ముడిని బట్టలు ఇస్తిరి చేయమనడం కూడా తప్పేనా ఇకమీదట నుంచి నీ పనులన్నీ మేము ఇలాగే చేసి పెడతామండి అని మంగళ అంటుంది. మీరు ఇలా మంచిగా ఉంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉంటారు అని రామ్మూర్తి అంటాడు. కట్ చేస్తే, ఇంత పొద్దు ఎక్కింది ఈ బాలిక ఎచట ఉన్నది అని గుప్తా గారు అమరేంద్ర రూమ్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడే పడుకో నీ కనిపిస్తుంది అరుంధతి. గుప్తా గారు తెల్లవారింది కదా రాథోడ్ని వెళ్లి కి మేకర్ తీసుకురమ్మనండి అని అరుంధతి అంటుంది. మనము వెళ్ళినప్పుడు వాళ్లు షాపు తీయరు వాళ్ళు షాప్ తీసినప్పుడు మనం వెళ్ళాలి ఇంత పొద్దున్నే ఎక్కడ షాపులు తీస్తారు అని గుప్తా అంటాడు. అయితే రాథోడ్ కి తాళం ఎక్కడ ఉందో చెప్పు అని అరుంధతి అంటుంది.
నా ఉంగరం నాకిచ్చినచొ నేను నిండుకుండ రత్తనికి పాతాళం ఎక్కడ ఉన్నదో చెప్పేదనుమా అమ్మను చూడవలెనని ఆశగా ఉన్నది బాలిక నా ఉంగరం ఇచ్చిన చూడు నీవు ఇచ్చటనే ఉండుము నేను ఒక్కడినే మా యమపురికి వెళ్లేదను అని గుప్తా అంటాడు. అయితే మీరు రాథోడ్ కి తాళం గురించి చెప్పండి నేను వెళ్లి ఈలోపు ఉంగరం తీసుకొస్తాను అని అరుంధతి అంటుంది. మాత గురించి చెప్పేసరికి ఈ బాలిక నా మాయలో పడిపోయింది అని గుప్తా అనుకుంటాడు. మెయిన్ డోర్ ఇటు ఉంది ఇక్కడి నుంచి వెళ్ళండి అని అరుంధతి వెళ్ళిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది