Trinayani December 04 2023 Episode 1101: సంధిస్తే చాలు పొగడడం మొదలు పెడతారు అని సుమన అంటుంది. అక్క పూలు తెచ్చావు ఎవరికీ అని పావన మూర్తి అంటాడు. మల్లెపూల సీజన్ అయిపోతుంది కదా అందుకే కొన్ని నేను పెట్టుకున్నాను కొన్ని కోడళ్ళకు తెచ్చాను అని తిలోత్తమ అంటుంది. అమ్మ తెచ్చింది కోడళ్ళ కోసం కాదు కదా అని వల్లభ అంటాడు. ఎవరికి ఇస్తావు అక్క అని పావన మూర్తి అంటాడు. ఇంకెవరికిస్తుంది సుమన అంటేనే కదా మక్కువ అని హాసిని అంటుంది. ఎందుకలా అనుకుంటావు నాకు అక్కర్లేదు మొన్న మా ఆయన తలలో పెట్టిన పూలు చాలు ఇంకా అత్త తెచ్చినవి పెట్టుకుంటే నవ్విపోతారు అని సుమన అంటుంది. పూలు పెట్టుకొని బజార్లో తిరుగుతావా ఏంటి అని విక్రాంత్ అంటాడు. అక్క పెద్ద కోడలికి ఇవ్వు అని పావని మూర్తి అంటాడు. మొగుడు తెచ్చినయ్ కాకుండా అత్త తెచ్చిన తురిమింది అని లోపల అంటారు నాకొద్దు అని హాసిని అంటుంది. అక్క చిన్న కోడలు వద్దన్నది పెద్ద కోడలు వద్దు అన్నది ఇక నడుపి కోడలికి ఇచ్చేయ్ అని పావని మూర్తి అంటాడు.
మీరిద్దరు పెట్టుకోనప్పుడు నాకు మాత్రం ఎందుకు అని నైని అంటుంది. నైనీ పెట్టుకోవచ్చు కదా అని విశాల్ అంటాడు. కాలము పెట్టుకొని వద్దు బాబు అని ఎద్దులయ్య అంటాడు. అందరూ వద్దంటే ఇంకెవరికి ఇస్తాను విశాలాక్షి పెట్టుకుంటుందిలే అని తిలోత్తమ అంటుంది. కట్ చేస్తే, స్వామీజీ వచ్చి నాగయ్య పాముని టపానికి తీసుకొని తన మెడలో వేసుకొని ఈశ్వర ఈ మంత్రపుష్పములు తొలగిపోయి నీ భార్య అయిన అంశాల లక్ష దగ్గరికి చేరుకునేలా చేయి అని ప్రార్థిస్తాడు. పాప నువ్వు కూడా వద్దంటావా అని వల్లభ అంటాడు. ఇస్తే తప్పకుండా తీసుకుంటాను పెదనాన్న అని విశాలాక్షి అంటుంది. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టదు ఎందుకు ఊరుకుంటుంది అని సుమన అంటుంది. ఇంతలో స్వామీజీ వస్తాడు. స్వామి కూర్చోండి అని నైని అంటుంది. అమ్మకి మైకం వస్తున్నట్టుంది అని ఎద్దులయ్య అంటాడు. విశాలాక్షి ఏమైంది తల్లో పూలు పెట్టుకోగానే మైకం కమ్మిందా అని అంటాడు. ఆ పిల్లకి ఏమైంది బాగానే ఉంది అని సుమన అంటుంది.
అమ్మవారు పూనారంటారా స్వామి అని నైని అంటుంది. ఏ అమ్మవారు పోనిందంటావు అని విక్రాంత్ అంటాడు. ఏ అమ్మవారిపునిందో నేను అడుగుతాను ఉండు విక్రాంత్ నీకు తెలియదు అని తిలోత్తమ అంటుంది. అమ్మ చిన్నపిల్లతో పరాచకాల తనకేమీ తెలియదు అని విశాల్ అంటాడు. పరాచకం ఏముంది విశాల్ అడిగి చూస్తే తెలుస్తుంది కదా అని తిలోత్తమ అంటుంది. ఈ దుర్మార్గులకు గాయత్రీ దేవి గండం గురించి తెలియకూడదు నీ పనితనం చూపించు నాగయ్య అని స్వామీజీ అంటాడు. నీ పేరేంటి అని తిలోత్తమ అంటుంది. నా పేరు విశాలాక్షి అని కళ్ళు మూసుకుని అంటుంది విశాలాక్షి. ఇంతకీ నువ్వెవరు ఎందుకిలా చేస్తున్నావు నేను అనుకున్నట్టు అన్ని విషయాలు చెప్పు అని తిలోత్తమ అంటుంది. మీరందరూ అనుకుంటున్నట్టు నేను గారడి పిల్లను కాదు కైలాసంలో నటరాజ స్వామితో నాట్యం చేసే పార్వతీ దేవిని అని చెప్పబోతూ ఉండగా నాగయ్య వచ్చి సాంబ్రాణిని కింద పడేస్తాడు. దానితో అమ్మ మొఖానికి అంత పొగ కమ్ముకొని విశాలాక్షి స్పృహ కోల్పోతుంది. నాగులయ్య ఎందుకిలా చేశావు విశాలాక్షి స్పృహ కోల్పోయింది అని నైని అంటుంది. కంగారు పడకండి విశాలాక్షి కైలాసనాధుని చేరి మళ్ళీ అరగంట తర్వాత వస్తుంది అని స్వామీజీ అంటాడు. తనకేమీ కాదు కదా స్వామి అని నైని కంగారుపడుతూ అంటుంది.
అంతా మన మంచికే జరుగుతుంది అనుకోవాలి నైని అని స్వామీజీ అంటాడు. అందరూ పక్కకు జరగండి విశాలాక్షికి గాలి ఆడాలి అని హాసిని అంటుంది. కట్ చేస్తే, అయ్యో విశాలాక్షికి ఏమైందో అని పావను మూర్తి కంగారు పడతాడు. తను కైలాసనాధుని చేరి మళ్ళీ వస్తుందిలే పావన మూర్తి ఎందుకు కంగారు పడతావు అని డమ్మక్క అంటుంది. డమ్మక్క ఎందుకు అలా అంటావు అని నైని అంటుంది.మీ అత్తయ్య మత్తు కమ్మే పూలు తెచ్చి విశాలాక్షికి పెట్టింది అమ్మ అని నైనితో డమ్మక్క చెబుతుంది. నైని ఏమైనా ప్రాబ్లమా నాకు చెప్పొచ్చు కదా అని విశాల్ అంటాడు. సీక్రెట్ కదా బాబు గారు చెప్పకూడదు అని నైని అంటుంది. భర్తకు కూడా చెప్పకూడదా నైని అని పావన మూర్తి అంటాడు. సీక్రెట్ కదా మామయ్య నువ్వు మగాడివి కదా నీకు ఎలా చెప్తుంది అని విశాల్ అంటాడు.చాలా థాంక్స్ అల్లుడు ఇన్నాళ్ళకి నువ్వు మగాడివి అని నన్ను అన్నావు అని పావన మూర్తి అంటాడు.నేను అనడమేంటి మామయ్య దురంధర అత్తయ్య అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నది అని విశాల్ అంటాడు.
లండన్ లో అందరూ అలా అనేవారు కాదు బాబు అందుకే మా ఆవిడకి కూడా నేను మగవాడిలా కనిపించకపోయేవాడిని అని పావనమూర్తి అంటాడు. నీ హైట్ ని చూసి అలా అనేవారేమో బాబాయి అని నైని అంటుంది.ఇప్పుడు ఆ గొడవ అంతా ఎందుకు కానీ డమ్మక్క నీతో ఏమన్నదో చెప్పు నైని నేను తెలుసుకోవాలి కదా అని విశాల్ అంటాడు. చెప్పేస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది బాబు అని డమ్మక్క అంటుంది.అమ్మవారు కోల్పోవడానికి శివయ్య గుడికి వెళ్లి పూజ చేసి తీర్థ ప్రసాదాలు తీసుకురాపో డమ్మక్క అని నైని అంటుంది. కట్ చేస్తే, స్పృహ కోల్పోయిన సోదరి అరగంటకు పైన అవుతుంది ఇంకా తేలుకోలేదు అని పావన మూర్తి కంగారు పడతాడు.
ధూపంతో స్పృహకోల్పో పోయింది కదా మావయ్య కొంచెం టైం పడుతుంది నువ్వేం కంగారు పడకు అని విశాల్ అంటాడు.సోదరి అలా పడిపోతే టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను అల్లుడు అని పావన మూర్తి అంటాడు. స్పృహ మాత్రమే కోల్పోయింది ప్రాణాలు కోల్పోలేదు మీరు ఎందుకు అంతలా టెన్షన్ పడిపోతున్నారు అని సుమన అంటుంది. నీ నోటితో మంచి మాటలే రావా అని విక్రాంత్ అంటాడు. నేను అన్న దాంట్లో తప్పేముంది మీరందరూ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు ఆ పిల్ల కళ్ళు తిరిగి కిందపడిపోయింది దానికి మీరు చనిపోయినట్టు కంగారు పడుతున్నారు అన్నాను అని సుమన అంటుంది.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!