Trinayani December 08 2023 Episode 1105: అయితే ఆ బెలూన్ వెనకాల నేను కూడా వస్తాను అత్తయ్య అని నైని అంటుంది. మేము కారులో వెళ్తాము నువ్వు నడుచుకుంటూ వస్తావా పెద్ద మరదలా అని వల్లభ అంటాడు. రేయ్ తనను కూడా మన వెంటే తీసుకు వెళ్దాం కానీ నువ్వు నోరు ముయ్యరా అని తిలోత్తమ అంటుంది. గండం ముంచుకొస్తుంది అని డమ్మక్క అంటుంది. విశాల్ హాసినికి ఏదో ఒకటి చెయ్ వదిన అన్నట్టుగా సైగ చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాని హాసిని జడ పిన్ను ఊడబీకి నైనీ తో పాటు విశాల్ వెళ్తాడు కానీ మీరెందుకు రాజా ఉండు ఆ బెలూన్ తీసి విశాల్ కు ఇస్తాను అని బెలూన్ ని పట్టుకొని పగల గొడుతుంది హాసిని. తిలోత్తమ కోపంతో హాసిని చంప పగలగొడుతుంది. నేను ఇంత శ్రమపడి వేసిన ప్లాన్ అంతా పాడు చేశావు కదే అని అంటుంది తిలోత్తమ. అమ్మ ఎందుకు వదినని కొట్టావు అని విశాల్ అంటాడు.
తింగరి దాని కొట్టాలా చంపాలా కొద్దిలో మిస్ అయిపోయింది లేకుంటే పెద్దమ్మ దొరికేది అని వల్లభ అంటాడు. అత్తయ్య హాసిని అక్కను ఏమీ అనకండి ఆ బెలూన్ ని తీసుకుని బాబు గారికి ఇద్దామనుకుంది అని నైని అంటుంది. నైని పాపని తీసుకువెళ్లి క్లీన్ చెయ్ పౌడర్ అంతా పడింది కదా అని విశాల్ అంటాడు. అమ్మ వదిన బెలూన్ పట్టుకుని నాకు ఇద్దామనుకుంది అది పగిలిపోతుంది అని తనకు మాత్రం ఏం తెలుసు అని విశాల్ అంటాడు. అది కాదు విశాల్ నిన్ను కన్నతల్లి ఎక్కడ ఉందో తెలుసుకుందామని ప్రయత్నం అంతా వృధా చేసింది అని తిలోత్తమ అంటుంది. ఏం చేస్తాం అమ్మ నన్ను కన్న తల్లిని చూసుకునే అదృష్టం లేదు అని విశాల్ అంటాడు.డమో డమో హాసిని మంచి పని చేశావు అని డమ్మక్క అంటుంది. వదిన నువ్వు లోపలికి వెళ్ళు అని విశాల్ అంటాడు. కొడితే కొట్టింది కానీ సౌండ్ భలేగా వచ్చింది విశాల్ అని హాసిని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పాప కొంచెం పాలు తాగమ్మా ఎందుకు ఇలా డల్ గా ఉన్నావ్ అని నైని అంటుంది. ఏమైంది హాసిని పాప పాలు తాగట్లేదా అని డమ్మక్క అంటుంది.
ఏమైంది నైని గాయత్రీ పాలు ఎందుకు తాగట్లేదు జ్వరం వచ్చిందా అని విశాల్ అంటాడు. తిలోత్తమ తెచ్చిన పౌడర్ మీద పడింది కదా బాబు అందుకే జ్వరం వచ్చి ఉంటుంది అని డమ్మక్క అంటుంది. మా అక్క కన్నా తొలి బిడ్డ గాయత్రి అంటావా అని సుమన అంటుంది. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఒక్కటై పోరు కదా గాయత్రి పెద్దమ్మ ఎక్కడో ఉంది ఇక్కడే ఉన్న పిల్లలకు జ్వరం వస్తే గాయత్రీ పెద్దమ్మకు గండం ఎలా వస్తుంది అని విక్రాంత్ అంటాడు. డమ్మక్క చెప్పింది నిజమే విక్రాంత్ అని హాసిని అంటుంది. అదెలా సాధ్యమవుతుంది అక్క పురుట్లోనే తప్పిపోయిన గాయత్రి అత్తయ్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి తిలోత్తమ అత్తయ్య వాళ్ళు ప్లాన్ వేస్తే నువ్వు పాడు చేశావు గాయత్రి పాపకు జ్వరం వస్తే డమ్మక్కేమో గండం వస్తుంది అంటుంది చచ్చిపోయి పాపగా పుట్టినా గాయత్రి అత్తయ్యకి కదా గండం రావాలి ఈ పాపకు జ్వరం వస్తే గండం ఎలా వస్తుంది అని సుమన అంటుంది. సుమన అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పగలను అని డమ్మక అంటుంది. శివ భక్తులైన మీరు ఇలా భయపడితే ఎలా డమ్మక్క అని విశాల్ అంటాడు. నేను భయపెట్టడం లేదు పుత్ర సమాధానం చెప్తానంటున్నాను అని డమ్మక్క అంటుంది.
నేను కన్నా తొలి బిడ్డకు గండం వస్తుందని ఎలా తెలుస్తుంది అని నైని అడుగుతుంది. త్రిలోత్తమ వాళ్ళు తెచ్చిన విభూది బెలూన్ లో ఉంది పట్టుకుందామంటే ఆ ప్రయత్నం కాస్త హాసిని వల్ల విఫలం అయింది అని డమ్మక అంటుంది. మరి ఈ పాపకి జ్వరం ఎందుకు వచ్చింది అని నైని అడుగుతుంది. హాసిని బెలూన్ పగలగొట్టినప్పుడు పౌడర్ అంతా గాయత్రి మీద పడింది కాబట్టి ఆ పౌడర్ వల్ల జ్వరం వచ్చింది అని డమ్మక్క అంటుంది. ఇక ఆపు డమ్మక్క నైని పాపని హాస్పిటల్ తీసుకెళ్దాం పద అని విశాల్ అంటాడు. ప్రయోజనం ఉండదు పుత్ర అని డమ్మక్క అంటుంది. ఎందుకు ఉండదు అని సుమన అంటూ ఉండగా ఇక నువ్వు నోరు మూసుకుంటే మంచిది అని విక్రాంత్ అంటాడు.అర్థమైంది నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని సుమన వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, గాయత్రీ కి జ్వరం ఎందుకు వచ్చింది అంటావు అని వల్లభ అంటాడు. మనం తెచ్చిన పౌడర్ వంటి మీద పడింది కదరా అందుకే వచ్చింటుంది అని తిలోత్తమ అంటుంది. ఏంటి అత్తయ్య ఇంకా నిద్ర పట్టడం లేదా టెన్షన్తో అని హాసిని అంటుంది. తింగరి దాన చూసుకుని నా డవే మీద పడతావ్ ఎందుకు అని తిలోత్తమ అంటుంది.
ఇందాక చేసిన పనికి డిసప్పాయింట్ అయ్యారా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది హాసిని. ఇది ఎక్కడ దొరికింది మమ్మీ మన కర్మకి అని వల్లభ అంటాడు. దాని గురించి పట్టించుకోకు కానీ ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించరా అని తిడతామ అంటుంది. కట్ చేస్తే, ఏంటి బ్రో గాయత్రి ని అలాగే వదిలేస్తే జ్వరం ఎక్కువ అయిపోతుంది హాస్పిటల్ తీసుకెళ్దామా అని విక్రాంత్ అంటాడు. ప్రయోజనం ఉండదు విక్రాంత్ అని ఆయాస పడుతూ చెప్తుంది హాసిని. ఎందుకు ఉండదు కొంపతీసి గాయత్రి పెద్దమ్మ పేరు పెట్టుకున్నంత మాత్రాన గండం గాయత్రి పాపకు వస్తుందా అని విక్రాంత్ అంటాడు.
వారు వీరు అవొచ్చు విరు వారు అవొచ్చు విక్రాంత్ అని హాసిని అంటుంది. పేరు పెట్టుకున్నందుకు గాయత్రి కి గండం వస్తుందా అని నైని టెన్షన్ పడుతుంది. ఏం కాదు నైని తాళపత్ర లలో అమ్మను వెతికి ఏ సమయంలో నాకు కష్టాలు వస్తాయి అని రాసింది కదా అందుకే ఇలా కష్టాలు పడుతున్నానేమో అని విశాల్ అంటాడు. కాని గాయత్రి పాపకి జ్వరం రావడానికి సంబంధం ఏముంది బాబు గారు అని నైని అంటుంది. ఎందుకు లేదు నైని అని విశాల్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!