తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో గత ఐదేళ్లలో తిరుగులేని విధంగా చక్రం తిప్పారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఖమ్మం టౌన్లో అందరిని రాజకీయంగా తొక్కేస్తూ తిరుగులేని కింగ్గా ఎదిగారు పువ్వాడ అజయ్కుమార్. కట్ చేస్తే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు చేతిలో ఓడిపోయారు.
పువ్వాడ 2014లో తుమ్మల నాగేశ్వరరావుపై, 2019లో నామా నాగేశ్వరరావుపై విజయం సాధించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు. అసలు సొంత పార్టీలోనే కాకుండా.. ప్రతిపక్ష పార్టీల్లోనూ తనకు పోటీ వచ్చే నేతలే లేకుండా రాజకీయం చేస్తూ వచ్చారు. అయితే బీఆర్ఎస్లో పువ్వాడ చర్యలతో అణగదొక్క పడ్డ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరో మంత్రిగా ఉన్న పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ కూడా కాంగ్రెస్లో చేరి ఇద్దరూ ఖమ్మం, పాలేరు నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో పాటు ఇద్దరూ మంత్రులు అయ్యారు.
ఇప్పుడు ఈ ఇద్దరు మంత్రుల ఉమ్మడి టార్గెట్ పువ్వాడ అజయ్కుమార్ కావడం విశేషం. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పాలేరులో పొంగులేటి చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అప్పుడే రాజకీయంగా యాక్టివ్ అయిపోయారు. అయితే పువ్వాడ మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలైనా పువ్వాడ బయటకు రావడం లేదు. దీంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యం ఏర్పడింది. వరుస కేసులు వెంటాడుతున్నాయి. చాలా మంది బీఆర్ఎస్ వాళ్లు పార్టీలు మారిపోతున్నారు.
ఇక ఎన్నికలకు ముందే ఖమ్మం కార్పోరేటర్లు కొంత మంది బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పగా.. ఎన్నికల తర్వాత మరి కొందరు బీఆర్ఎస్ కార్పోరేటర్లు పార్టీలు మారిపోయారు. తమకు భరోసా ఇచ్చే లీడర్ లేకపోవడంతో నియోజకవర్గ బీఆర్ఎస్లో పలువురు లీడర్లు, కార్పోరేటర్లు, కీలక నేతలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక మంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమందిని నానా రకాలుగా పువ్వాడ ఇబ్బంది పెట్టారు.
ఇప్పుడు పువ్వాడ చేసిన పనికి అంతే స్థాయిలో రాజకీయంగా అణగదొక్కాలన్న భావన కాంగ్రెస్ నాయకులు, కేడర్లో ఉంది. అందుకే పువ్వాడ కూడా ఈ రాజకీయ దాడి నుంచి తప్పించుకునేందుకు బయటకు రావడం లేదని.. ఆయన బీఆర్ఎస్ను వీడి ఏ బీజేపీలోకి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న ప్రచారం అయితే ఖమ్మం రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తోంది.