YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు పోలిక ఎక్కడ ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతారని ప్రజలు జగన్ కు ఓట్లు వేశారని అన్నారు.
మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ఈ ప్రభుత్వం కళాశాలలకు చెల్లించలేదని, దీంతో కళాశాలలు విద్యార్ధులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని అన్నారు. ప్రజలకు ఏమి మేలు చేశారని జగన్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు. జగన్ దేనికి సిద్ధం .. రూ.8 లక్షల కోట్లు అప్పు చేయడానికా.. ప్రజల నెత్తిన కుచ్చుటోపి, చెవిలో పూలు పెట్టడానికా అని షర్మిల ప్రశ్నించారు. జగన్ ఎప్పుడైనా ప్రజలతో మమేకం అయ్యారా అని అడిగారు.
మద్యపాన నిషేదం చేయకపోతే మళ్లీ ఓట్లు అడగమని చెప్పిన జగనన్న చేశారా అని ప్రశ్నించారు. మద్య నిషేదం చేయలేదు సరికదా చివరికి సర్కారే మద్యం అమ్ముతోందని, ఇదేనా మాట నిలబెట్టుకోవడం అని ధ్వజమెత్తారు. ప్రపంచంలోని ఎక్కడా లేని బ్రాండ్ లు ఏపీలోనే ఉన్నాయని విమర్శించారు. జగన్ వాగ్దానాలు అన్నీ మద్యం షాపుల్లోనే నిలబెట్టుకున్నట్టుందని షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను