ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు ఒకే రోజు 500 మార్క్ను క్రాస్ చేశాయి.. ఏపీ సర్కార్ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో ఏపీలో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..కరోనా బారిన పడి 7 మంది మృత్యువాత పడ్డారు.
రాష్ట్రంలో స్థానికంగా 477 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
దీంతో.. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 10,884కు చేరింది.. ఇప్పటి వరకు 136 మంది మరణించారు.. గత 24 గంటల్లో 118 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. వారి సంఖ్య 4,988కు పెరిగింది.. ప్రస్తుతం వివిధ ఆస్పత్రల్లో 5,760 మంది చికిత్స పొందుతున్నారు.
ఇక, నిన్నటి వరకు ఏపీలో 7,69,319 శాంపిల్స్ పరీక్షించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.