Breaking: సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. వారి కరవు భత్యం (డీఏ) 4 శాతం పెరిగింది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న 46 శాతం డీఏ 50 శాతానికి చేరుకున్నట్లు అయ్యింది. జనవరి 1, 2024 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో దాదాపు కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.12,869 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి దీని ప్రభావం రూ.15,014 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది. అలానే కేబినెట్ సమావేశం.. భారత్ లో కృత్రిమ మేథ (ఏఐ) అభివృద్ధి, పరిశోధన కోసం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా.. రూ.10వేల కోట్లతో ఏఐ మిషన్ కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏఐపై యువత శిక్షణ, అవిష్కరణ కేంద్రాల ఏర్పాటు, కంప్యూటరింగ్ మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకోనున్నారు.
గోవా శాసనసభలో షెడ్యుల్ తెగల కు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం ఎస్టీ లకు రిజర్వేషన్ సీట్లు లేవు. జనాభా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈశాన్య భారతం కోసం రూ.10,037 కోట్లతో కొత్త పారిశ్రామిక అభివృద్ధి పథకం ఉన్నతి కి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2024 – 25 సీజన్ లో ముడి జనపనారకు కనీస మద్దతు ధరను క్వింటాల్ కు రూ.285లు పెంచారు. దీంతో ధర రూ.5,335కి చేరింది. ఈ నిర్ణయంతో తూర్పు రాష్ట్రాలు.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత సైన్యం, ఇండియన్ కోస్ట్ గార్డు అవసరాల కోసం 34 కొత్త ఏల్ హెచ్ ధ్రువ్ హెలికాఫ్టర్ ల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆర్మీకి 25, ఇండియన్ కోస్ట్ గార్డుకు 9 చొప్పున హెలికాఫ్టర్ లను సమకూర్చనున్నారు.
YS Sharmila: ప్రత్యేక హోదా కోసం ఒక్కరైనా రాజీనామా చేశారా ..? నిజమైన ఉద్యమం చేశారా ..? వైఎస్ షర్మిల