YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని అన్నారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదని అన్నారు. ఈ విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
మంగళగిరి లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిన బూనారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని, ఆయన మాటతోనే తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాను కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేదని షర్మిల అన్నారు. అలా అనుకుంటే 2019 లోనే ఇక్కడ అడుగుపెట్టేదానినని షర్మిల వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ నిరాహార దీక్షలు చేయడమే కాక మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్నారని, సీఎం అయ్యాక ఆ పార్టీ నుండి ఒక్కరైనా రాజీనామా చేశారని అని ప్రశ్నించారు. ఒక్కటైనా నిజమైన పోరాటం ప్రత్యేక హోదా కోసం చేశారా అని అడిగారు. హోదా మన బిడ్డల హక్కు .. దీన్ని ఎంత మంది పట్టించుకున్నారని ప్రశ్నించారు. హోదా వచ్చి ఉంటే రాజధాని, పోలవరం మనం కట్టుకోలేమా అని అన్నారు. మన రాష్ట్రం ఎందుకు తక్కువగా ఉండాలని ప్రశ్నించారు.
పదేళ్ల తర్వాత హోదా అనే ఊసే లేదని అన్నారు. హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకుందన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హ క్కు అని అన్నారు. ప్రజలు గొర్రెల లెక్క కాదు.. సింహాల లెక్క బ్రతకాలి అని అంబేద్కర్ అన్నారని గుర్తు చేస్తూ..గొర్రెలను బలి ఇస్తారు కానీ సింహాలను బలి ఇవ్వరని అన్నారు. హోదా విషయంలో మనం పదేళ్లు గొర్రెలు అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి అయిదేళ్లు చంద్రబాబు మనలను గొర్రెలను చేశారని, ఆ తర్వాత జగన్ మరో అయిదేళ్లు గొర్రెలను చేశాడన్నారు.
మనం సింహాల మాదిరిగా పోరాటం చేయకపోతే హోదా రాదని అన్నారు. పోరాడితే పోయేది ఏమీ లేదు .. బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు. ఆంధ్రులను మోసం చేసిన మోడీ ఒక డి ఫాల్టర్, ఒక కేడీ అని ఘాటుగా విమర్శించారు. ఏపీలోని ప్రతిపక్షం, పాలకపక్షం రెండు బీజేపీకి తొత్తులు అని విమర్శించారు. టీడీపీ బహిరంగ పొత్తు అయితే జగన్ ది కనపడని పొత్తు అని అన్నారు.
బీజేపీ నిర్ణయాలను ఒక్క రోజు వ్యతిరేకించరని, మోడీకి ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీతో ఉన్న అక్రమ పొత్తులను కాంగ్రెస్ ప్రతి కార్యకర్త జనాలకు అర్ధం అయ్యేలా చెప్పాలన్నారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని కొత్త భాష్యం చెప్పారు. వైసీపీ, టీడీపీ, జనసేన ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినట్లేనని జనాలకు కాంగ్రెస్ శ్రేణులు చెప్పాలన్నారు.
KA Paul: కేఏ పాల్ కు కోపం వచ్చింది .. సచివాలయం మెట్లపై కూర్చుని నిరసన ..ఎందుకంటే..?