జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం హైకోర్టులో అట్టర్ ఫ్లాప్ అవుతోంది. దీంతో వైయస్ జగన్ కి అసలైన ప్రతిపక్షం రాజకీయ పార్టీలు కాదని హైకోర్టు అంటూ నెటిజన్ల సోషల్ మీడియాలో సెటైర్లు వేయడం మనకందరికీ తెలిసిందే. వైయస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే నిర్ణయాలు చాలావరకు హైకోర్టులో కూప్ప కూలిపోవడంతో, ఎదురు దెబ్బలు తగలడంతో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వెళ్లిన దాఖలాలు కూడా ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉండగా ఇన్ని బ్యాడ్ న్యూస్ ల మధ్య హైకోర్టు జగన్ సర్కార్ కి ఒక విషయంలో మాత్రం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రభుత్వ భూములను విక్రయించే విషయంలో హైకోర్టు జగన్ సర్కార్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మొదటిలో భూముల విక్రయాలను ఖచ్చితంగా హైకోర్టు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం గ్యారెంటీ అనే వార్తలు వచ్చాయి. కానీ హైకోర్టు ఇటీవల విశాఖ, గుంటూరు జిల్లాల్లోని తొమ్మిది చోట్ల భూముల వేలానికి సంబంధించిన ప్రక్రియను కొనసాగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బిల్డ్ ఏపీలో భాగంగా జగన్ సర్కారు ప్రభుత్వ భూములను గుర్తించి మార్కెట్ ధరకు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు విక్రయించాలని నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రతిపక్షాలకు షాక్ అనే చెప్పాలి.