సమాజంలో రోజురోజుకీ మానవ విలువలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. టెక్నాలజీ పుణ్యమో లేకపోతే సినిమాల పుణ్యమో తెలియదుగానీ మనిషి ఆలోచనలు మృగం కంటే హీనంగా మారుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా బిడ్డలను అలానే పెంచుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మీరు పాత కాలానికి చెందిన వాళ్లు మీకు ఏమి తెలియదు అని సెటైర్లు వేస్తున్నారు. దీంతో బిడ్డలు వావివరసలు తెలియకుండా ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా అవగాహన లేకుండా సమాజంలో మెలుగుతున్నారు.
ఇటువంటి సమయంలో కూతురు మేనల్లుడితో పడక గది లో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు మేనమామ కి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో చోటు చేసుకుంది. మరదల పిల్ల తో పడక గదిలో శృంగారం చేస్తూ మేనల్లుడు మేనమామ కంటకి కనబడటంతో…. తన కూతురు తో మంచం మీద బట్టలు లేకుండా కనబడటంతో పెళ్లి కాకుండానే అలా చేయటం తట్టుకోలేక స్పాట్ లోనే దారుణంగా చంపేశాడు. కొడుకుతో కలిసి మేనమామ తన కూతురితో రాసలీలలు సాగిస్తున్న మేనల్లుడిని ఆ మంచం మీదే గొంతునులిమి చంపేసి రైల్వే ట్రాక్ పై పడేశారు. రోజూ ఇంటికి మేనల్లుడు వస్తున్నా ఏదో పని ఉందని అనుకున్న మేనమామ ఒక రోజు అర్ధరాత్రి తన కూతురు గదిలో శబ్దం రావడంతో మంచం మీద సీన్ చూసి షాకయ్యాడు. కూతురితో రాసలీలలు సాగిస్తున్న మేనల్లుడిని పట్టుకుని చితకబాదాడు…అంతేకాకుండా అతన్ని బయటకు తీసుకెళ్ళి మరి గొంతు నులిమాడు.. ఈ పని అబ్బా కొడుకు ఇద్దరు కలిసి చేశారు..అలా అతను అనంతరం శవాన్ని రైల్వే ట్రాక్పై పడేశాడు. దీంతో రాత్రి నుంచి కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గాలించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే శవాన్ని రైల్వే ట్రాక్ పక్కన పొలంలో పోలీసులు గుర్తించడంతో పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం లో అనుమానాస్పదంగా చనిపోయినట్లు రిపోర్ట్ రావడంతో వెంటనే పోలీసులు అతడి ఫోన్ కాల్ డేటా.. చెక్ చేయగా మొత్తం బండారం బయటపడింది. ఆ అమ్మాయి తన తండ్రి మరియు తన అన్న కలిసి బావని చంపినట్లు చెప్పేసింది. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.