NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ముగ్గురు వైసీపీ ఎంపీల‌కు టీడీపీ సీట్లు… జ‌గ‌న్‌కు ఇది బిగ్ షాకేనా…!

రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ప్ర‌త్య‌ర్థికి శ‌త్రువు మ‌రో ప్ర‌త్య‌ర్థికి మిత్రుడు అవుతారు. ఇప్పుడు ఏపీలోనూ రాజ‌కీయాలు ఇలానే ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీలో గ్రాఫ్ స‌రిగాలేద‌ని.. స‌ర్వేలు స‌రిగా లేద‌ని చెబుతూ.. టికెట్లు మార్చిన అంటే.. నియోజ‌క‌వ‌ర్గాల‌ను మార్చిన నాయ‌కులు.. పార్టీకి దూర‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో పార్టీకి రెబ‌ల్‌గా మారిన నాయ‌కుడు కూడా ఉన్నారు. అయితే.. వీరి ఆర్థిక ప‌రిస్థితి.. సామాజిక ప‌రిస్థితిని అంచ‌నా వేస్తే.. వీరు మ‌రోసారి గెలిచే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీంతో వీరికి.. టీడీపీ పెద్ద‌పీట వేసింది. రావ‌డ‌మే ఆల‌స్యం అన్న‌ట్టుగా.. అటు జ‌న‌సేన కూడా తీసేసుకుంది.

వీరే.. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు, వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి. వీరు ప్ర‌స్తుతం వైసీపీ ఎంపీలుగానే ఉన్నారు. కానీ, వీరిలో ర‌ఘురామ త‌ప్ప‌.. మిగిలిన ఇద్ద‌రు పార్టీకి, ఎంపీ ప‌ద‌వులు కూడా రాజీనామా చేశారు. పార్టీ రాజీనామా ఎలా ఉన్నా.. ఎంపీగా వారు రాజీనామా చేసినా.. ఇంకా అనుమ‌తి పొంద‌లేదు. అయిన‌ప్ప‌టికీ.. వీరి ముగ్గురికి.. టీడీపీ. జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం సీట్ల‌ను ఖ‌రారు చేసింది. ర‌ఘురామ‌కు.. టీడీపీ త‌ర‌ఫున న‌ర‌సాపురం పార్ల‌మెంటు స్థానాన్ని కేటాయించారు. దీనిని ఆయ‌న ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. అనుకున్న‌ట్టుగానే ద‌క్కింది.

ఇక‌, వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌లో చేరనున్నారు. ఆయ‌న‌కు తాజాగా మ‌చిలీప‌ట్నం టికెట్‌నే కేటాయించారు. ప్ర‌స్తుతం ఈయ‌న ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీ కావ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ఈయ‌న‌కు స్థాన‌చ‌ల‌నం చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, న‌ర‌స‌రావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయుల‌ను పార్టీ గుంటూరు నుంచి పోటీ చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఏ పార్టీలోనూ చేరలేదు. కానీ, టీడీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని తెలిసిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఆయ‌న‌కు న‌ర‌స‌రావుపేట టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు.

దీంతో వైసీపీ కాద‌నుకున్న నాయ‌కుల‌కు.. టీడీపీలో స‌ముచిత గౌర‌వం ల‌భించింద‌ని ఆయా నాయ‌కుల అనుచ‌రులు చెబుతు న్నారు. పైగా వీరిలో ఎవ‌రూ కూడా వివాదాల నాయ‌కులు కాక‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌తో సంబంధాలు ఉన్న‌వారు కావ‌డం.. అభివృద్ధి ప‌థంలో ప‌య‌నించ‌డం వంటివి క‌లిసి వ‌స్తున్నాయి. ర‌ఘురామ పార్టీతో, జ‌గ‌న్‌తో విబేధించినా ఆయ‌న‌పై ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌లు, అవినీతి లాంటి మ‌ర‌క‌లు లేవు. పైగా నాలుగేళ్ల పాటు అధికార ప‌క్షంపై ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు, సెటైర్ల‌తో ఓ రేంజ్‌లో పోర‌టం చేశారు.

ఇక వైసీపీలో అంద‌రి ఎంపీల‌క‌న్నా ది బెస్ట్ ఎంపీగా న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయుల‌కు మంచి పేరు ఉంది. ఇటు బాల‌శౌరి కూడా జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు. కానీ జ‌గ‌న్‌తో వేగ‌లేక విసిగిపోయి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఏది ఎలా ఉన్నా.. వీరికి త‌మ త‌మ స్థానాలు ద‌క్క‌డం.. బ‌ల‌మైన మిత్ర‌పక్షం అండ‌గా ఉండ‌డంతో వీరి గెలుపుపై అంచ‌నాలు వ‌స్తున్నాయి.

Related posts

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N