Zee Telugu Kutumbam Awards 2023:జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2023 ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. జీ తెలుగు అంటేనే ఎంటర్టైన్మెంట్ కు పెట్టిన పేరుగా చెప్పుకుంటారు జి అవార్డు ఇవ్వడం వల్ల నటీనటులను ప్రోత్సహించే విధానం, వారి ప్రయాణాన్ని ఉత్సాహంగా మార్చుకునే విధంగా జీ తెలుగు అవార్డులను అందిస్తుంది. కొత్తగా సీరియల్స్ లోకి వచ్చిన వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్లకి ఎప్పటినుంచో జీ తెలుగులో సీనియర్ నటులు వాళ్లకి కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం జీ తెలుగు గొప్ప ప్రయత్నం.
ఈవెంట్ లో చాలామంది సినిమా నటీనటులు, అలాగే టీవీ తారలు పాల్గొన్నారు. వారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పవచ్చు. ఈ ప్రోగ్రాం అక్టోబర్ 29న మొదటి పార్ట్ 1 ను, నవంబర్ 5వ తారీఖున జీ తెలుగులో పార్ట్ 2 ప్రసారం అయింది. ఇందులో చాలా సుప్రైజ్ లోని ప్లాన్ చేశారు జీ తెలుగు వాళ్ళు ఈ ప్రోగ్రాం మొదటి భాగం కు రవి శ్యామల యాంకర్స్ గా అల్లరించారు రెండవ పార్ట్ కు ప్రదీప్ రేష్మి యాంకర్స్ గా అలరించారు.
పార్ట్ వన్ లో చాలా కేటగిరీస్ కు అవార్డు ప్రజెంటేషన్ చేశారు పుట్టింటి వెలుగు, ఆత్మీయ పురస్కారం చిచ్చరపిడుగు,రొమాంటిక్ కపుల్, బెస్ట్ కెమిస్ట్రీ, ఉత్తమ కొడుకు, వివిధ విభాగాలలో అవార్డులను అందించారు. ఈవెంట్లో నేచురల్ స్టార్ నాని,రాంగోపాల్ వర్మ,సంయుక్త మీనన్,రేణు దేశాయ్, అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్ అనంత శ్రీరామ్,సుమ,రాజీవ్ కనకాల, రఘు బాబు, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయ,రష్మీ పాయల్ రాజ్ పుత్, ఇలా కొంతమంది నటీనటులతో పాటు సీనియర్ నటులైన శివపార్వతి, జయప్రద, ఇలా కొంతమంది తారాగణంతో జి తెలుగు అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈవెంట్ లో జయప్రద మగువా మగువా అంటూ ఎమోషనల్ సాంగ్కు డాన్స్ వేసి అలరించింది. అనసూయ రష్మీ కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ కి డాన్స్ చేస్తారు వర్షా నిషా సౌందర్య బార్బీ యాక్ట్ సాంగ్ కి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. జగదాత్రి సీరియల్ లో జగదాత్రి స్కిట్ ద్వారా కీర్తన అలరించింది. డ్రామా జూనియర్స్ పిల్లలు ఒక స్కిట్ ద్వారా అలరించారు.