KCR: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసిఆర్) యశోద ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. శుక్రవారం వేకువజామున ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు హైదరాబాద్ సోమాజీగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ సమీపంలోని ఫామ్ హౌస్ లో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైనట్లు తెలుస్తొంది.
బాత్రూమ్ లో కాలు జారి పడిపోవడంతో ఆయనకు గాయాలైనట్లు తెలిసింది. బాత్రూమ్ లో కాలు జారి పడటం వల్ల కేసిఆర్ ఎడమ కాలి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తొంది. దీంతో, వెంటనే ఆయనను సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే శస్త్ర చికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. వైద్య పరీక్షలు పూర్త అయిన తర్వాత శస్త్ర చికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
కేటిఆర్, హరీష్ రావులు ఆసుపత్రి వైద్యులతో మాట్లాడగా, కేసిఆర్ తుంటి ఎముక రీప్లేస్ చేయాలని వైద్యులు సూచించినట్లు గా తెలుస్తొంది. విషయం తెలియడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ముఖ్య నేతలు కేటిఆర్, హరీష్ రావులకు ఫోన్ చేసి కేసిఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. పరామర్శిస్తున్నారు. కేసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Janasena: పవన్ కళ్యాణ్ బిగ్ ఝలక్ ఇచ్చిన విశాఖ ప్రజలు