Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2011లో “ఏ మాయ చేసావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. దీంతో అనేక అవకాశాలు రావడంతో సమంతకి బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ రావడం జరిగాయి. సమంత నటించిన అన్ని సినిమాలు అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాలు కావటంతో మరింత డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో సామ్ టాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ లో అనేక సినిమాలు చేయడం జరిగింది. దక్షిణాదిలో తెలుగు మరియు తమిళ్ సినిమా రంగంలో దాదాపు టాప్ హీరోలందరితో నటించింది.
ఆ తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకుంది. నాలుగు సంవత్సరాలు వివాహ జీవితం సవ్యంగా సాగిన గాని.. 2021లో విడాకులు తీసుకోవడం జరిగింది. నాగచైతన్యతో మనస్పర్ధలు సమంతా కెరియర్ కి కొద్దిగా బ్రేకులు వేసినట్లు అయింది. ఆ సమయంలోనే హిందీలో కూడా వెబ్ సిరీస్ చేసి అందరిని ఆకట్టుకుంది. అయినా గాని వ్యక్తిగతంగా తన జీవితంలో చాలా డ్యామేజ్ అయిన గాని సహాయ కార్యక్రమాలు చేయడంలో సమంత ఎప్పుడూ కూడా ముందుంటుంది. ఈ రకంగానే తన సంపాదనలో సమాజంలో బలహీన మహిళా ఆడపిల్లల జీవితాలకు తాను స్థాపించిన ప్రత్యూష స్వచ్ఛంద సంస్థ ద్వారా చేయూతనిస్తది.
ఈ క్రమంలో మొన్నటిదాకా విదేశాలలో ఉన్న సమంత తాజాగా హైదరాబాద్ కి రావటం జరిగింది. ఈ క్రమంలో ఓ చిన్న పిల్లల స్కూల్ కార్యక్రమంలో హాజరైంది. ఆ సమయంలో పిల్లలతో కలిసి సమంత సరదాగా ముచ్చటించారు. ఈ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో వాళ్లతో కలిసిపోయి ఫోటోలో దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక పుస్తకం మరియు పెన్ను ఒక పిల్లోడు ఒక టీచర్ మాత్రమే ప్రపంచాన్ని మార్చగలరు అంటూ సమంత కామెంట్ పెట్టింది. సమంత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!