ఈ రోజుల్లో ఎవరూ డబ్బులు జేబులో లేదా పర్సు లో పెట్టుకుని తిరుగుతున్నది లేదు. ప్రతి అత్యవసర అవసరానికి తమ మొబైల్ ఫోన్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా సచివాలయంలో డిజిటల్ పేమెంట్ కు పెద్దపీట వేసే ఏర్పాట్లు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కొత్త ప్రక్రియలు చేపడుతూ ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్క సర్వీసు ఉండేలా వెసులుబాటు కల్పిస్తూ ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్ చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ముందుగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…. కెనరా బ్యాంక్ తో అనుసంధానంగా అమలు చేయనున్న ఈ డిజిటల్ పేమెంట్స్ ప్రక్రియ త్వరలోనే అన్నీ సచివాలయాలకు అందుబాటులోకి రానుంది.
ఇంతే కాకుండా కొద్ది రోజుల క్రితమే ప్రతి సచివాలయంలో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఏర్పాటు చేసేందుకు కూడా వైసీపీ ప్రభుత్వం పూనుకున్న. విషయం తెలిసిందే