VMC Systems: రూ.1700 కోట్ల ఫ్రాడ్ కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. విఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ కు చెందిన ముగ్గురు డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, వెంకట రమణలపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుండి రుణాలు పొందిన ముగ్గురు డైరెక్టర్లలో ఉప్పలపాటి హిమబిందును అరెస్టు చేసిన ఈడీ మిగిలిన ఇద్దరు డైరెక్టర్ల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రూ. 539కోట్లు, ఎస్బీఐ, ఆంధ్రబ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు నుండి రూ.1207 కోట్లు విఎంసీ సిస్టమ్స్ కంపెనీ రుణాలు పొందింది. కాగా కంపెనీకి బీఎస్ఎన్ఎల్ నుండి రూ.33 కోట్లు బకాయిలు రావాల్సి ఉండగా రూ.262 కోట్లు రావాల్సి ఉన్నట్లు కంపెనీ డైరెక్టర్ లు 2018 లో సీబీఐని తప్పుదోవపట్టించారు.