Breaking: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో కేసు నమోదు అయ్యింది. నల్లజర్లలో జరిగిన ఓ సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డిపై అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ను పరుష పదజాలంతో దూషించిన అయ్యన్న పాత్రుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రామకృష్ణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు అయ్యన్నపాత్రుడి మీద 153 ఏ, 505 (2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More: TDP News: చంద్రబాబు సెన్సేషనల్ డెసిషన్..!? వాళ్లంతా సీట్లపై ఆశలు వదులుకోవాల్సిందే..!!
Breaking: ఇంతకు ముందు కూడా
ఇంతకు ముందు కూడా అయ్యన్నపాత్రుడుపై సీఎం జగన్ ను దూషించారన్న ఆరోపణలతో కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను టీడీపీ నేతలు దూషిస్తే వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం, దానిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇలా కేసులు నమోదు చేస్తుండటంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలను వేధించేందుకు కేసులు పెడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.