TDP News: తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తీవ్ర గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది. అయితే ఇటీవల మున్సిపల్ ఎన్నికల నాటి నుండి టీడీపీ కొంత యాక్టివ్ అయ్యింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీ అధినేత చంద్రబాబు రకరకాల ప్లాన్లు, స్ట్రాటజీలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ లను పక్కన పెట్టి యువతను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చారుట. అదే విధంగా వరుసగా రెండు సార్లు ఓడిపోయిన నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలిచి 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరికి అవకాశం ఇస్తారుట. అదీ కూడా నియోజకవర్గంలో క్షేత్ర స్థాయి నుండి వచ్చే ఫీడ్ బ్యాగ్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందట.
TDP News: 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయిన వారికి
అయితే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయిన వారికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సీటు ఇచ్చే అవకాశాలు లేవు అంటున్నారు. 2014 ఎన్నికల్లో మోడీ ప్రభంజనం, పవన్ కళ్యాణ్ మద్దతుతో పాటు చంద్రబాబు ఇమేజ్ పని చేసినప్పుడే సుమారు 60 మంది ఓటమి పాలైయ్యారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన వారిపైనా 2019లో సానుభూతి పని చేయలేదు. ఇక 2024 ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇచ్చినా హాట్రిక్ ఓటమి పాలవుతారని భావించి వారి స్థానంలో వేరే వారిని అభ్యర్ధులుగా ఎంపిక చేస్తారని సమాచారం.
TDP News: క్షేత్ర స్థాయి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే..
ఈ రెండేళ్ల పాటు నియోజకవర్గంలో ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నాయకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారుట. ఈ సారి ఇంతకు ముందులా ఒత్తిళ్లకు తలొగ్గి సీట్ల కేటాయింపు చేయడం కాకుండా ముందుగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని ఎవరైతే బాగుంటుంది అని తెలుసుకుని వారికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Read More: Chandrababu: పార్టీ అనుబంధ కమిటీ నేతలకు తలంటిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎందుకంటే..?