Exit polls 2022: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఉత్తరప్రదేశ్ లో ఏడవ దశ (చివరి విడత) ఎన్నికల పోలింగ్ ముగిసింది. అతి పెద్ద రాష్ట్రం యూపీిలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా, పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. మణిపూర్ లో 60 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గడంపై రకరకాల విశ్లేషనలు వస్తున్నాయి. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. యూపిలో ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎస్పీ అధికార పీఠాన్ని కైవశం చేసుకుంటుందని అంచనా వేయగా, పలు సర్వే సంస్థలు యూపీ ఓటర్లు మళ్లీ బీజేపీకే అధికారాన్ని కట్టిబెట్టినట్లు అంచనా వేశాయి.
Exit polls 2022: బీజేపీకీ 262 – 277..?
ఉత్తరప్రదేశ్ లో మ్యాట్రైజ్ పోల్ ప్రకారం బీజేపీకీ 262 – 277, సమాజ్ వాదీ కి 119 – 134, బీఎస్పీకి 7 -15. కాంగ్రెస్ 3- 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. పి మార్క్ ప్రకారం యూపిలో బీజేపీకి 240, ఎస్పీకి 140, బీఎస్పీకి 17, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు రానున్నాయి. ఇతరులు రెండు స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం బీజేపీ కూటమికి 262 – 277, ఎస్పీ కూటమికి 119 – 134, బీఎస్పీకి 7-15 సీట్లు వస్తాయని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈ సారి 90 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్ల బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూపీలో బీజేపీ, ఎస్పీ హోరా హోరీ తలపడినట్లు కనిపించినా క్షేత్ర స్థాయిలో బీఎస్పీ కూడా బలమైన ఉనికిని కనిపించింది అని అంటున్నారు.
ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ అధిక్యంగా ఉన్నట్లు టైమ్స్ నౌ అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలకు బీజేపీకి 37, సమాజ్ వాదీ పార్టీకి 31, ఆప్ 1, ఇతరులు 1, వస్తాయని తెలిపింది. పంజాబ్ లో ఇండియా టూడే ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 19-31, బీజేపి 1-4, ఏఏపీ 76 -90, ఇతరులు 7-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.మణిపూర్ లో మొత్తం 60 స్థానాలకు గానూ జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 23 – 28, కాంగ్రెస్ 10-14, ఎన్ పీపీ 7-8, ఎన్పీఎఫ్ 5-7, జేడీయు 5-7, ఇతరుుల 2- 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గోవాలో సీఎన్ ఎక్స్ అంచనా ప్రకారం బీజేపికి 11-16, కాంగ్రెస్ 11-17, ఆప్ 2, ఇతరులు 5-7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగా, జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 13-19, కాంగ్రెస్ 14 -19, ఆప్ 1-2, ఇతరులు 4-8 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.