దర్శకుడు వేణు దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన విరాటపర్వం ఇటీవల విడుదల కావడం తెలిసింది. ఈ సినిమాలో రానా కూడా కీలక పాత్ర పోషించారు. అయితే సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో సాయి పల్లవి చేసిన కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ సంచలనం రేపాయి. కాశ్మీర్ పండిట్స్ మరియు గోవధ హత్యలు విషయంలో సాయి పల్లవి చేసిన కామెంట్లు ఆమెకు తిప్పలు తెచ్చిపెట్టాయి. ఈ విషయానికి సంబంధించి సాయి పల్లవి పై బజరంగ్దళ్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది.
అంత మాత్రమే కాదు ఈ కేసుకు సంబంధించి సాయి పల్లవికి సదరు పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారులు గత నెల 21వ తారీఖున నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ నోటీసులను రద్దు చేయాలంటూ సాయి పల్లవి తెలంగాణ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు… పోలీసుల నోటీసులను రద్దు చేసేందుకు నిరాకరించడం జరిగింది. సాయి పల్లవి అభ్యర్థులను తిరస్కరిస్తూ న్యాయస్థానం పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఈ పరిణామంతో సాయి పల్లవి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది. తాజా పరిణామాలు బట్టి చూస్తే ఆమె పోలీసుల విచారణకు హాజరు కావలసిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి తన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తనపై అనవసరమైన తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంది.
మీరు రైట్ వింగ్ కి సపోర్ట్ చేస్తారా లేదా లెఫ్ట్ వింగ్ కి సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తే మంచి మనుషులుగా జీవించాలన్న ఉద్దేశంతోనే సమాధానం ఇవ్వడం జరిగిందని పేర్కొంది. కానీ చేసిన కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకునీ ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ ప్రచారం చేశారని సాయి పల్లవి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నేను మొదట డాక్టర్ మనిషి ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఎంసెట్ వంటి రూపంలో ఉన్న దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని.. ప్రాణం తీసే హక్కు మరొకరకు లేదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఎవరైనా బాధపడే ఉంటే క్షమాపణ తెలియజేస్తున్నాను అని స్పష్టం చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో సాయి పల్లవికి హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. ఆమె విచారణకు హాజరు కావలసిన పరిస్థితి నెలకొంది.