అగ్ర కథానాయుకులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో ఆడిపాడిన సీనియర్ హీరోయిన్ టబు.. తెలుగులో సినిమా చేసి చాలా కాలైమెంది. త్వరలోనే సెట్స్కు వెళ్లబోయే బన్ని, త్రివిక్రమ్ సినిమాలో టబు నటించనుంది. అయితే తాజాగా మరో తెలుగు సినిమాలో టబు తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారట. రానా, సాయిపల్లవిలతో ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల ఓ సినిమా తెరకెక్కనుంది. జూన్లో ఈ సినిమా ప్రారంభమవుతుందని టాక్. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను విజయశాంతితో చేయించాలనుకున్నారు. విజయశాంతి కూడా ముందు ఆసక్తి చూపినా.. కొన్ని కారణాలతో తప్పుకున్నారని సమాచారం. దీంతో యూనిట్ టబుని ఆ పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారని వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post