ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ తరంలో హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రేజ్ను ఈజీగా తీసుకుండా తన సినిమాలను దక్షిణాది భాషల్లో విడుదల చేస్తూ సౌతిండియన్ స్టార్గా పేరు, మార్కెట్ను సంపాదించుకునే పనిలో ఉన్నారు ఈ కుర్ర హీరో. అలాగే కేవలం హీరోగానే కాకుండా.. కింగ్ ఆఫ్ ద హిల్ అనే బ్యానర్ను స్థాపించి ‘నోటా’ చిత్రంతో నిర్మాతగా మారారు. తొలి సినిమాను నిర్మించక పోయినా ప్రొడక్షన్లో భాగమై నిర్మాతగా మారిన విజయ్ దేవరకొండకు `నోటా` షాకిచ్చింది. అయితే విజయ్ దేవరకొండ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఈసారి పూర్తిస్థాయి నిర్మాతగా మారి సినిమా చేస్తున్నాడు. తనకు ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో హీరోగా బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్ను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సినిమా చేయనుండటం విశేషం. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన సీరియల్ నటి వాణి భోజన్ నటించనుంది. సమీర్ దర్శకత్వంలో సినిమా త్వరలోనే సెట్స్కి వెళ్లనుంది.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!