Pawan Kalyan-TDP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక ప్రకటన చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు లో లో ఉన్న చంద్రబాబు తో గురువారం పవన్ కళ్యాణ్ ములాఖత్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లతో కలిసి జైలు కు వెళ్లిన పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ను పరామర్శించారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ,జనసేన కలిసి వెళ్ళాలనేది తన కోరికని చెప్పారు. పవన్ అన్నారు. వైసీపీ అరాచకాలను అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదని అన్నారు. టిడిపి తో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయం ఈ రోజే తీసుకున్నట్లు చెప్పారు.
బీజేపీ కూడా కలిసి వస్తుందన్న ఆశభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసి జైలు కు పంపడం దుర్మార్గం అని అన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండే క్రిమినల్స్ను వదలబోమని హెచ్చరించారు.
ఒక మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితి వస్తే అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అన్నారు. రాష్ట్రం లో అరాచక పాలన చూస్తున్నామని వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వం ఆ బుదరను అందరిపైనా చల్లాలని ప్రయత్నిస్తోందని పవన్ మండిపడ్డారు. జగన్ చేసేవి అన్నీ రాజ్యాంగ ఉల్లంఘన పనులేనని విమర్శించారు.