Madhura Naik: ఇజ్రాయేల్ దళాలు పూర్తి స్థాయిలో గాజాపై పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో హమాస్ బెదిరింపులకు దిగింది. తాము ఇప్పటి వరకు ఇస్లాం ప్రకారం బందీలను సురక్షితంగా ఉంచామని… అయితే ఇజ్రాయేల్ జరిపే ప్రతి ఒక్క దాడికి ఓ పౌరుడిని హత్య చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న కుటుంబాలు తమ ప్రియమైన వారిని పొగొట్టుకుని దుఃఖంలో ఉన్నాయి. గాజాను దిగ్బంధించి.. హమాస్ ముష్కరులను అంతం చేయడానికి ఇజ్రాయేల్ చేపట్టిన ఆపరేషన్లో అమాయకులు బలైపోతున్నారు. అటు, ఇజ్రాయేల్లోకి చొరబడిన హమాస్ క్రూరత్వానికి బలైపోయిన కన్నీటి కథలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ వాతావరణం లో పలువురు భారతీయులు చిక్కుకున్నారు. వారిని క్షేమంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ అజయ్ ద్వారా భారతీయులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇజ్రాయిల్ లో బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా చిక్కుకుపోయింది. నుష్రత్ భరూచా అక్కడ చిక్కుకు పోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఇజ్రాయిల్ లోని భారత రాయబారి కార్యాలయం రంగంలోకి దిగి ఆమెని నేడు తెల్లవారుజామున ఇండియాకు కనెక్ట్ ఫ్లైట్ లో పంపించారు.
తాజాగా, భారతీయ మోడల్, నాగిని సీరియల్ నటి మధుర నాయక్ సోదరి ఒడయా, ఆమె భర్తను హమాస్ ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. వారి పిల్లల ముందే తన సోదరి, ఆమె భర్తను పాశవికంగా హత్యచేశారని మధుర నాయక్ కన్నిటీ పర్యంతమైంది. తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన ఆమె.. ‘నా కుటుంబం ఎదుర్కొంటున్న బాధ, ఆవేదనను మాటల్లో చెప్పలేను.. ఇజ్రాయేల్ వీధులు హమాస్ ఆగ్రహంతో మంటల్లో కాలిపోతున్నాయి… మహిళలు, పిల్లలు, వృద్ధులు, బలహీనులను లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని నాయక్ ఆవేదన వ్యక్తం చేసింది.
నాగిన్ సీరియల్ తో ఆమె పాపులర్ ఐంది. మధుర తన సోదరి ఒడయాతో ఉన్న ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేశారు.
మధుర నాయక్ ఇంస్టాగ్రామ్ వీడియోలో… ”నేను భారతీయ మూలాలకు చెందిన యూదును. ఇండియాలో యూదులు కేవలం 3000 మంది ఉంటారు. అక్టోబర్ 7న మా కుటుంబం ఒక కూతురు, కొడుకును కోల్పోయింది. నా కజిన్ ఒడయా, ఆమె భర్తను పిల్లల ముందే కాల్చి చంపారు.
మా కుటుంబం పడే బాధ, ఆవేదన వర్ణనాతీతం. ప్రస్తుతం ఇజ్రాయెల్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హమాస్ ఉగ్రవాదుల కారణం పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. వీధులు మంటల్లో ఆహుతి అవుతున్నాయి. మహిళలు, వృద్దులు, పిల్లలు, బలహీన వర్గాలను వారు టార్గెట్ చేస్తున్నారు అని ఆవేదన చెందారు. మధుర నాయక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె కుటుంబానికి అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె క్షేమం గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Follow us for more information : https://newsorbit.com/national/operation-ajay-israel-top-5-evacuation-operations-like-operation-ajay-by-india.html