NewsOrbit
జాతీయం న్యూస్ ప్ర‌పంచం

Operation Ajay: ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ రహత్ తరహాలో ఆపరేషన్ అజయ్… క్లిష్టకాలంలో భారతీయులను కాపాడిన టాప్ 5 ఎవాక్యూయేషన్ ఆపరేషన్స్ ఇవే!

Operation Ajay Israel Top 5 Evacuation Operations Like Operation Ajay by India
Share

Operation Ajay: భారత సైన్యానికి ఆపదలో ఉన్న సమయాలలో ఆదుకోవడం కొత్తేమీ కాదు. మన సైన్యం, వాయుసేన కలిసి ఎన్నో గొప్ప సాహసోపేతమైన అద్భుతాలు చేశారు. ఇప్పుడు ఇజ్రాయిల్ , పాలెస్తీనా యుద్ధం లో ఎందరో ప్రాణాలు కోల్పోతుండగా అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారత్ కు తీసుకు రావడానికి ఆపరేషన్ అజయ్ ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇస్రాయిల్ లోనే 20000 మంది భారతీయులు ఉన్నారని వార్త. అందులో విద్యార్థులు, ఉద్యోగులు, మరి ఇతరులు కూడా ఉన్నారు. ఇటువంటి అజయ్ లాంటి ఆపరేషన్స్ ని మన సైన్య ఇదివరలో ఎన్ని సార్లు చేసిందో చూదాం. మన సైన్యానికి సెల్యూట్ చేద్దాం.

Operation Ajay Israel Top 5 Evacuation Operations Like Operation Ajay by India
Operation Ajay Israel Top 5 Evacuation Operations Like Operation Ajay by India

1. Top Evacuation Operations By India: 1. ఆపరేషన్ ట్రైడెంట్

1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో భారత నావికాదళం పాకిస్తాన్‌ రేవు పట్టణం, కరాచీపై చేసిన దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అంటారు. ఈ ఆపరేషన్‌కు కొనసాగింపుగా నావికాదళం చేపట్టినది ఆపరేషన్ పైథాన్. నౌకా విధ్వంసక క్షిపణులను వాడిన తొలి యుద్ధం ఈ ప్రాంతంలో ఇదే. డిసెంబరు 4-5 రాత్రి చేపట్టిన ఈ ఆపరేషన్ పాకిస్తాన్ నౌకలు, స్థావరాలకు తీవ్ర నష్టం కలగజేసింది. పాకిస్తాన్ ఒక మైన్ స్వీపరు, ఒక డిస్ట్రాయరు, ఆయుధాలను చేరవేస్తున్న ఒక రవాణా నౌక, ఇంధన నిల్వ స్థావరాన్ని కోల్పోగా, భారత్‌కు ఏమాత్రం నష్టం కలగలేదు. పాకిస్తాన్ యొక్క మరొక డిస్ట్రాయరుకు తీవ్ర నష్టం కలగ్గా దాన్ని తరువాతి కాలంలో దళం నుండి తొలగించారు. విజయవంతమైన ఈ ఆపరేషనుకు గుర్తుగా భారత నౌకాదళం ప్రతి డిసెంబరు 4 ను నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటోంది.

2. ఆపరేషన్ సఫేద్ సాగర్

ఆపరేషన్ సఫేద్ సాగర్, 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం, భారత వైమానిక దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషనుకు పెట్టిన పేరు. పాకిస్తాన్ సైన్యానికి చెందిన సాధారణ సైనికులను, సైన్యం పోషణలో ఉన్న కిరాయి సైనికులూ కార్గిల్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పర్వతాలను అక్రమంగా ఆక్రమించుకుని తిష్ట వేసారు. వారిని తరిమి కొట్టే లక్ష్యంతో ఈ ఆపరేషన్ను చేపట్టారు. 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వైమానిక శక్తిని ఉపయోగించడం ఇదే తొలిసారి.

Operation Ajay Israel: యుద్ధం లో ఇరుక్కున్న 18 వేల భారతీయులు, మొదటి బ్యాచ్ ఇంటికి ఈ రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ అజయ్’ వివరాలు!

3. ఆపరేషన్ రాహత్(“రిలీఫ్”)

ఆపరేషన్ రాహత్(“రిలీఫ్”) అనేది 2013 ఉత్తర భారతదేశ వరదల వల్ల ప్రభావితమైన పౌరులను తరలించడానికి భారత వైమానిక దళం యొక్క సహాయక చర్యలకు పెట్టిన పేరు. కొండ ప్రాంతాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో వేలాది మంది యాత్రికులు వివిధ లోయల్లో చిక్కుకుపోయారు. ఇది అనేక దశాబ్దాల్లో భారత సాయుధ దళాల అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటి. మరియు ఐఏఎఫ్ ఇది ప్రపంచంలో ఏ వైమానిక దళం హెలికాప్టర్లను ఉపయోగించి చేపట్టిన అతిపెద్ద పౌర రెస్క్యూ ఆపరేషన్ అని పేర్కొంది. 2013 జూన్ 17 నుండి మొదటి దశ ఆపరేషన్ సమయంలో, ఐఎఎఫ్ మొత్తం 19,600 మందిని ఎయిర్ లిఫ్ట్ చేసింది – మొత్తం 2,140 విమానాలను ఎగురవేసింది మరియు మొత్తం 3,82,400 కిలోల సహాయ సామగ్రి మరియు పరికరాలను దింప బడ్డాయి.

Operation Ajay Israel Top 5 Evacuation Operations Like Operation Ajay to Rescue Indians
Operation Ajay Israel Top 5 Evacuation Operations Like Operation Ajay to Rescue Indians

4. ఆపరేషన్ గంగా

అనేది 2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్ లో ఇరుక్కున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్. భారత ప్రభుత్వం కైవ్‌లోని తన రాయబార కార్యాలయం ద్వారా సంఘర్షణకు ముందు తన కమ్యూనికేషన్ మార్గాల ద్వారా సలహాలు జారీ చేసింది. ఫిబ్రవరి 24 ఉదయం ప్రభావిత ప్రాంతాలపై గగనతలం మూసివేయబడటానికి ముందు సుమారు 4000 మంది భారతీయ పౌరులు ఉక్రెయిన్ నుండి బయలుదేరారు. భారతీయ పౌరులందరూ పశ్చిమ ఉక్రెయిన్‌లోని పట్టణాలకు వెళ్లి ఆశ్రయం పొందాలని, భారత అధికారులతో సమన్వయం చేసుకున్న తర్వాతే సరిహద్దుకు వెళ్లాలని సూచించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తరలింపులో సహాయం చేయడానికి ప్రత్యేక ట్విట్టర్ హ్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఎయిరిండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్ వంటి ప్రైవేట్ క్యారియర్‌లు తరలింపులో సహాయపడే ఎయిర్‌లైన్స్. భారత వైమానిక దళం అదనపు సహాయాన్ని అందించింది. మొదటి విమానం రొమేనియాలోని బుకారెస్ట్ నుండి ఫిబ్రవరి 26న బయలుదేరింది, ఫిబ్రవరి 27న భారత ప్రామాణిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:55 గంటలకు ఢిల్లీ చేరుకుంది. 27 ఫిబ్రవరి 2022 నాటికి (3వ రోజు), 469 మంది విద్యార్థులు భారతదేశానికి వచ్చారు.స మన్వయ ప్రయత్నాలకు సహకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రతినిధులను పంపాడు. ఫిబ్రవరి 28 నాటికి ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి, కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారుతో ఆపరేషన్‌కు సంబంధించి మూడు ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్షత వహించాడు. 2 మార్చి 2022న భారత ప్రభుత్వ అఫిడవిట్‌ అంచనా వేయబడిన 20,000 మంది భారతీయ పౌరుల్లో 12,000 మంది విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దును దాటారు

5. ఆపరేషన్ కావేరి

ఆపరేషన్ కావేరి అనేది 2023 సూడాన్ సంఘర్షణ సమయంలో సుడాన్ నుండి భారతీయ పౌరులు, విదేశీ పౌరులను తరలించడానికి భారత సాయుధ దళాలచే కొనసాగుతున్న ఆపరేషన్. పౌరుల తరలింపు ప్రస్తుతం వాయు, సముద్రం ద్వారా నిర్వహించబడుతోంది, చాలావరకు పోర్ట్ సుడాన్‌లో ఐఎన్‌ఎస్ సుమేధ ద్వారా భారత నావికాదళం ద్వారా ఎక్కువ తరలింపు జరిగింది. సూడాన్‌లో, ప్రధానంగా రాజధాని (ఖార్టూమ్)లో వేలాది మంది భారతీయుల తరలింపు కోసం ఈ ఆపరేషన్ నిర్వహించబదినది. పెరుగుతున్న ఉద్రిక్తతలు, సంఘర్షణతో అప్రమత్తమైన భారతదేశం అనేక ఇతర దేశాలలో చేరి సుడాన్ నుండి జాతీయులను, పౌరులను భారీగా తరలించింది. మరుసటి రోజు పోర్ట్ సూడాన్‌లో 500 మంది భారతీయులకు సహాయం కావలసినందున భారతదేశం ఆపరేషన్ కావేరీని ప్రారంభించినట్లు ప్రకటించింది.
మన సైన్యం మన కు గర్వకారణం. వారు నిరంతరం మేలుకుని ఉండ బట్టే మనం నిశ్చింతగా నిద్ర పోగలుగు తున్నాము , మేర భారత్ మహాన్.


Share

Related posts

ఈ గింజలు డయాబెటిస్ వారికి వరం..!

bharani jella

పవన్ తో ఆ టాప్ డైరెక్టర్..?

sekhar

Nuts: ఆరోగ్యానికి ఈ గింజలు నెం.1.. మధుమేహం, బీపీ కంట్రోల్..!

bharani jella