Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం తుఫాను గా మారింది. ఈ తుఫానుకు హమూన్ గా నామకరణం చేశారు. ఈ పేరును ఇరాన్ సూచించింది. ఒడిశాలోని పారాదీప్ కు 230 కిలో మీటర్ల, పశ్చిమ బెంగాల్ లోని దిగాకు 360 కిలో మీటర్ల దూరంలో, బంగ్లాదేశ్ లోని హెపుపురాకు 510 కిలో మీటర్లదూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. రాబోయే 12 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఈ తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫాను గా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
రేపు బంగ్లాదేశ్ లోని హెపుపురా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. హమూన్ తుఫాను కారణంగా భారత తీర ప్రాంతంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఒడిశాలో ఒ మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గాలులు కూడా వీస్తాయని పేర్కొన్నారు.
ఐఎండీ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయ్యింది. జిల్లా కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఒడిశా పై నేరుగా ప్రభావం మాత్రం ఉండదు కానీ జాలర్లు ఎవరూ బుధవారం వరకూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఉరుములతో కూడిన ఓ మాస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్థానిక వాతావరణ విభాగం వెల్లడించింది.
Roja Ambati: జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంపై మంత్రులు రోజా, అంబటి విమర్శలు ఇలా..
Alert: Cyclone 'Hamoon' Strengthens, Coastal Areas on High Alert Stay safe! Cyclone 'Hamoon' is getting stronger. Follow official advisories for updates and precautions. pic.twitter.com/jV4aDhbvRk
— India Meteorological Department (@Indiametdept) October 24, 2023