PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రమే తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి విమానాశ్రయం వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. అదే విధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితర నేతలు మోడీకి స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పూలు చల్లి స్వాగతించారు.
అనంతరం అక్కడి నుండి తిరుమల చేరుకుని రచన అతిధి గృహంలో రాత్రి బస చేశారు. ఉదయం శ్రీవారి దర్శనానికి మోడీ బయలుదేరగా, ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి, అర్చుకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధాని మోడీకి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆ తర్వాత మోడీకి శ్రీవారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలను టీటీడీ చైర్మన్ అందజేశారు. కాగా ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని మోడీ దర్శించుకోవడం ఇది నాలుగవ సారి.
అనంతరం మోడీ రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి హైదరాబాద్ బయలుదేరారు. ఇవేళ మహబూబ్ నగర్, కరీంనగర్ బహిరంగ సభల్లో మోడీ ప్రసంగిస్తారు. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షోతో మోడీ తెలంగాణ ఎలక్షన్ టూర్ ముగుస్తుంది.
KCR: పదవి కోసం కొట్లాడటం లేదంటూ కేసిఆర్ ఎమోషనల్ స్పీచ్