NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Modi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి మోడీ

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రమే తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. తిరుపతి విమానాశ్రయం వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. అదే విధంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తదితర నేతలు మోడీకి స్వాగతం పలికారు. అభిమానులు, కార్యకర్తలు పూలు చల్లి స్వాగతించారు.

అనంతరం అక్కడి నుండి తిరుమల చేరుకుని రచన అతిధి గృహంలో రాత్రి బస చేశారు. ఉదయం శ్రీవారి దర్శనానికి మోడీ బయలుదేరగా, ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి, అర్చుకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం ప్రధాని మోడీకి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదశీర్వచనం చేశారు. ఆ తర్వాత మోడీకి శ్రీవారి చిత్రపటం, తీర్ధ ప్రసాదాలను టీటీడీ చైర్మన్ అందజేశారు. కాగా ప్రధాని హోదాలో తిరుమల శ్రీవారిని మోడీ దర్శించుకోవడం ఇది నాలుగవ సారి.

అనంతరం మోడీ రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడ నుండి హైదరాబాద్ బయలుదేరారు. ఇవేళ మహబూబ్ నగర్, కరీంనగర్ బహిరంగ సభల్లో మోడీ ప్రసంగిస్తారు. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షోతో మోడీ తెలంగాణ ఎలక్షన్ టూర్ ముగుస్తుంది.

KCR: పదవి కోసం కొట్లాడటం లేదంటూ కేసిఆర్ ఎమోషనల్ స్పీచ్

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju