Animal: డిసెంబర్ మొదటి తారీకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” సినిమా విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని భాషలలో ప్రమోషన్ కార్యక్రమాలు చురుగ్గా జరిగాయి. తెలుగుకి సంబంధించి కూడా “యానిమల్” ప్రమోషన్స్ ఓ రేంజ్ లో నిర్వహించడం జరిగింది. బాలకృష్ణ షో “అన్ స్థాపబుల్” షోకి సినిమా హరో హీరోయిన్ మరియు దర్శకుడు రష్మిక మందన, సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. “యానిమల్” సినిమా యూనిట్ తో బాలకృష్ణ షో చాలా రసవతరంగా ముందుకు నడిపించారు. ఇదిలా ఉంటే నవంబర్ 27వ తారీకు సోమవారం తెలుగు వర్షన్ “యానిమల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిలుగా హాజరు కాబోతున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సినిమా తెలుగు హక్కులను టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు 15 కోట్లకు దక్కించుకున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన “యానిమల్” ట్రైలర్ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది.
చాక్లెట్ బాయ్ ఇలాంటి రణబీర్ కపూర్ నీ చాలా వైలెంట్ గా సందీప్ రెడ్డి చూపించారు. దీంతో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ ఓపెనింగ్స్ వస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజు.. సినిమా ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా రాజమౌళి ఇంకా మహేష్ “యానిమల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఆల్రెడీ గతంలో రాజమౌళి తీసిన “RRR” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సందీప్ రెడ్డి వంగా తన వంతుగా పాల్గొని సినిమాకి కొద్దిగా హైపు వచ్చేలా చేయడం జరిగింది. సో ఇప్పుడు రాజమౌళి..”యానిమల్” కోసం తనవంతుగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.