ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా.. అందరూ తల ఒంచాల్సిందే. ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరో ఒక పక్షమే విజయం దక్కించుకుంటుంది. సో.. దేశంలో అనేక మంది హేమాహేమీలు కూడా.. ఎన్నికల్లో గెలుపు ఓటములను చవి చూసిన వారే. అయితే.. ఇప్పటికీ.. నాయకులు ఓటమి అంటే.. భయంతో బిక్కచచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నాయకుడు ఒకరు మరింతగా ఓటమి అంటే.. భయపడిపోతున్నారు.
తాను ఎక్కడ ఓడిపోతానో.. అని తీవ్రస్తాయిలో వణికి పోతున్న సదరు ఎమ్మెల్యే.. ఇప్పుడు.. వినూత్న పం థాతో ముందుకు సాగుతున్నారు. తన వ్యతిరేక ఓటు ను చీల్చి.. తాను ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా సరికొత్త ఎత్తుగడ వేశారు. ఏకంగా.. తన కుమారుడినే ఇండిపెండెంటుగా రంగంలోకి దించారు. ఇది ఎక్కడా విని కూడా ఉండరు కానీ.. జరిగింది.
ఆ నాయకుడే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూర పాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. ఇక్క డ ఆయనకు తిరుగులేని ఎదురుగాలి వీస్తోంది. ఎక్కడ విన్నా ఎక్కడ కన్నా.. వ్యతిరేకత పెరిగింది. పైగా ప్రత్యర్థి పార్టీ టీడీపీ నుంచి భాష్య ప్రవీణ్ బరిలో ఉండడంతో ఆయనకు అనుకూల గాలి వీస్తుండడంతో దీనిని చూసి తన పరాజయాన్ని ముందుగానే ఊహించిన నంబూరి హడలి పోతున్నారు. ఎందుకంటే.. ఐదేళ్లలో ఆయన ఇక్కడ చేసింది ఏమీలేదు. దీంతో వ్యతిరేకత ఓ రేంజ్లో పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో నంబూరి చిత్రమైన ఆలోచన చేశారు. తనపైనే తన కుమారుడిని రెబల్గా నిలబెట్టారు. ఆయన కుమారుడు నంబూరి కళ్యాణ్ చక్రవర్తి.. పెదకూరపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో ఓటు చీలుతుందని.. తన వ్యతిరేక ఓటు టీడీపీకి పడకుండా చూడొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు.. నంబూరు కళ్యాణ్ చక్రవర్తి.. తన ఎన్నికల గుర్తుగా .. `గాజు గ్లాసును` ఎంచుకోవడం గమనార్హం. మొత్తానికి నంబూరి చేసిన ఈ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.