Chelluboyina Venugopala Krishna: ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గుండె నొప్పి కారణంగా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. మంత్రి వేణుగోపాల కృష్ణను పరీక్షించిన వైద్యులు వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.
మంత్రి చెల్లుబోయిన ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. మంత్రి వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైన వార్త విని ఆయన అనుచరులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిసింది.
PM Modi: హైదరాబాద్ లో భారీ రోడ్ షోతో ముగిసిన పీఎం మోడీ తెలంగాణ ఎలక్షన్ ప్రచారం.. హైలెట్ ఏమిటంటే..?