Supreme Court: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టు విచారణ జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇవేళ విచారణే జరగలేదు.
ఇవేళ (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టు హాల్ కు చేరుకున్నారు. అయితే ఈ రోజు తాము ధర్మాసనంలో కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ద బోస్ స్పష్టం చేశారు.
తదుపరి విచారణ తేదీ ప్రకటించాలని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా ఈ సందర్భంగా కోరారు. తదుపరి విచారణ తేదీని తర్వాత ప్రకటిస్తామని జస్టిస్ అనిరుద్ద బోస్ తెలిపారు. దీంతో సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసులో విచారణ జరగలేదు. అవినీతి నిరోధక చట్టం 17ఏ తో ముడిపడి ఉన్నందున ధర్మాసనం గతంలో ఈ కేసును వాయిదా వేస్తూ వచ్చింది. అప్పటి వరకూ చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
అయితే మంగళవారం సెక్షన్ 17 ఏ పై ధర్మాసనం బిన్న తీర్పులు వెలువరించిన నేపథ్యంలో ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పై ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈవేళ ధర్మాసనంలో జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది కూర్చోకపోవడంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ జరగలేదు.
YSRCP: నేడో రేపో వైసీపీ నాల్గవ జాబితా .. 25 నుండి సీఎం జగన్ క్యాడర్ తో సమావేశాలు