YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులు చేస్తొంది. ఇప్పటికే మూడు జాబితాల ద్వారా 59 నియోజకవర్గాల్లో ఇన్ చార్జి మార్పు పూర్తి చేసింది వైసీపీ. సామాజిక సమీకరణలు, గెలుపు ఓటములను దృష్టిలో పెట్టుకుని సర్వే రిపోర్టుల ఆధారంగా ఇన్ చార్జిల మార్పు ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలో నాల్గవ జాబితాపై ఆసక్తి నెలకొంది. సంక్రాంతి పండుగ కారణంగా మూడు రోజులుగా అభ్యర్ధుల మార్పులు, చేర్పుల కసరత్తుకు అంతరాయం ఏర్పడింది. మరల ఈ రోజు నుండి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో చర్చలు కొనసాగనున్నాయి. పలు నియోజకవర్గాల ఇన్ చార్జిలకు ఇప్పటికే కబురు వెళ్లింది. నాల్గవ జాబితాను పండుగకు ముందే విడుదల చేయాలని భావించింది పార్టీ. అయిదారు స్థానాల మార్పునకు స్పష్టత వచ్చినప్పటికీ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు గా తెలుస్తొంది.
ఇవాళో రేపో ఆ జాబితా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ అధినేత హోదాలో క్యాడర్ మీటింగ్ ల నిర్వహణకు సిద్దమవుతున్నారు. రాష్ట్రంలో అయిదు జోన్ ల మీటింగ్ లను నిర్వహించనున్నారు. తొలి సమావేశాన్ని విశాఖ జిల్లా భీమిలి లో క్యాడర్ మీటింగ్ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్యాడర్ మీటింగ్ లు ప్రారంభానికి ముందే మొత్తం అభ్యర్ధులను ప్రకటించాలని పార్టీ భావిస్తొంది.
TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు