Poonam Pandey: బాలీవుడ్ హీరోయిన్ పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో కంటే ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలలో నిలిచారు. అటువంటి ఆమె గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందినట్లు ఆమె అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ వార్తలు ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈ విషయం తెలుసుకుని ఆమె అభిమానులు సినీ లవర్స్ ఉలిక్కిపడుతున్నారు. ప్రస్తుతం పూనమ్ పాండే వయసు 32 సంవత్సరాలు. అయితే ఆ పోస్ట్ లో ఉన్నది…” ఈ ఉదయం మాకు చాలా కఠినతరమైనది. గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే.. మరణించారని తెలియజేయడానికి చాలా చింతిస్తున్నాము.
ఇలాంటి దుఃఖ సమయంలో ఆమెను గుర్తు చేసుకోవాల్సి ఉంది” అని పోస్ట్ పెట్టారు. కాగా బాలీవుడ్ మీడియాలో ఉత్తర ప్రదేశ్ లో ఉన్న నివాసంలో పూనమ్ పాండే మరణించినట్లు ఓ జాతీయ మీడియా జర్నలిస్ట్ చెప్పుకొస్తున్నారు. పూనమ్ పాండే మరణ వార్త ఆమె పిఆర్ టీం కూడా ధ్రువీకరించిందని త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తారని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టకు ముందు మోడలింగ్ రంగంలో పూనమ్ రాణించటం జరిగింది. ఆ తర్వాత 2013వ సంవత్సరంలో “నాషా”అనే సినిమాతో… బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టారు. అయితే సినిమాల్లో అవకాశాల కంటే ఆమె ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలలో నిలిచి ప్రముఖంగా వార్తల్లో నిలిచారు.
ఒకానొక సమయంలో ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలో వస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ రకమైన కామెంట్లతో మీడియాలో వార్తల్లో నిలిచి బాగా ఫేమస్ అయ్యారు. గ్లామర్ పరంగా కూడా రకరకాల ఫోటోలతో సోషల్ మీడియాలో అభిమానులను అలరించేవారు. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ చాలా కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో పూనమ్ పాండే.. 32 సంవత్సరాల వయసులోని మరణించటంతో బాలీవుడ్ మీడియా.. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో మరి కొంతమంది అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో.. అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.