YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదాకై ఢిల్లీ స్థాయిలో పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కు సంబందించి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో ప్రశ్నించాలని కోరారు. ఈ మేరకు పవార్ కు వినతి పత్రం అందించారు. ప్రస్తుత ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందని తెలిపారు. షర్మిలతో పాటు మాజీ రాజ్యసభ్యుడు కేవీపీ రామచంద్ర రావు, సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి, మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు.
అలానే ఈ రోజు ఏపీ భవన్ లో వైఎస్ షర్మిల దీక్షకు దిగుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా షర్మిల దీక్ష చేస్తున్నారు.
TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!