Trinayani February 2 2024 Episode 1153: గురువుగారు నూనెలో వేసి కాల్చమంటారా లేకపోతే పెనం మీద పెట్టి వేయించమంటారా అని హాసిని అంటుంది. ఏం చేయదలుచుకున్నారే మీరు ఈ తోక పూజ ఏమో గాని నన్ను కాల్చి బూడిది చేసేలాగా ఉన్నారు మీరు అని తిలోత్తమ అంటుంది. గురువుగారు ఏమి చెప్పక ముందే మీరు ఎందుకు అనుకుంటున్నారు ఆగండి అని అంటుంది డమ్మక్క.గురువుగారు మీరు వివరంగా చెప్పండి అని పావన మూర్తి అంటాడు.నేను చెప్పక ముందు తిలోత్తమ చెప్పాలి అని గురువు గారు అంటారుస్వామి దర్శనం కావాలి అని చెప్పాను కదా గురువుగారు అని అంటుంది.అది అబద్దం అని గురువుగారు అంటారు.
అది అబద్ధం ఎలా అవుతుంది గురువుగారు అమ్మ బయటికి చెప్పింది కదా అని అంటాడు విశాల్ బయటికి ఒకటి చెప్పి మనసులో ఇంకొకటి కోరుకుంది అందుకే ఇలా జరిగింది అని అంటారు గురువుగారు. ఇందాక అత్తయ్యతో అదే మాట చెప్పాను స్వామి ఒప్పుకోలేదు తర్వాత చెప్పక తప్పలేదు అని నైని అంటుంది.అదేంటో చెప్పు అక్క అని సుమనఅంటుంది నా నోటితో నేను చెప్పను సుమన అని నైని అంటుంది. అత్తయ్య మీరైనా చెప్పండి ప్లీజ్ అని అంటుంది. నేను చెప్పను అని తిలోత్తమ అంటుంది. అంత భయంకరమైన కోరిక ఏం కోరుకున్నావో కనీసం నాకైనా చెప్పు అమ్మ అని వల్లభ అంటాడు అది అందరికీ చెప్పేది కాదురా అని అంటుంది తిలోత్తమా మరి నైని వదినతో చెప్పావు కదా అమ్మ అని విక్రాంత్ అంటాడు.ఈ విషయం వదిలేయండి ఈ ఆకులు ఎలా తీయాలో ఆ విషయం చెప్పండి అని అంటుంది తిలోత్తమ. ఇంకా ఆలోచించేదేం లేదు నువ్వు చెప్పినట్టు కాల్ చేయడమే అని అంటుంది డమ్మక్క. ఎలా కలుస్తారు నా మొహం మండిపోదా అని అంటుంది తిలోత్తమ గురువుగారు మీరే చెప్పండి ఎలా కాల్చాలో అని పావన మూర్తి అంటాడు.
గాయత్రీకి సంబంధించిన కోరిక కోరుకుని ఉండాలి తిలోత్తమా అని అంటారు గురువుగారు. అవును అని చెప్తుంది తిలోత్తమ. అయితే గాయత్రీ దేవి వాడిన లాంతరును వెలిగించి తీసుకురండి ఆ పేరు పెట్టుకున్న ఈ పసిపాపను దగ్గరకు తీసుకొని లాంతరు సెగ ముఖానికి తగిలేలా ఈ గాయత్రీ చేత అతుక్కుపోయిన ఆ నాగవల్లి పత్రాలను తొలగించాలి అని అంటారు గురువుగారు.వినడానికి తేలికగానే ఉంది గాని చేస్తే కష్టంగా ఉంటుందేమో అని సుమన అంటుంది.నేను వెళ్లి తీసుకొస్తాను అని నైని వెళ్తుంది. కొంచెం జాగ్రత్తగా తీయండి గ్లాసు తొలగిన నమ్మకం నా చర్మం ఊడి వచ్చేలా ఉంది అని తిలోత్తమఅంటుంది. చర్మం రావాలంటే ముందు ఆకులు రావాలి కదా అని హాసిని అంటుంది. రెండిటిని కూడా పీకుతారా ఏంట అని వల్లభ అంటాడు నాకు చెప్పడం కాదు మీ అమ్మకి చెప్పుకోండి సక్రమమైన కోరికలు కోరుకోవాలని అని హాసిని అంటుంది.అసలు ఈ పూజ చేయకుండా ఉంటే బాగుండేది అని తిలోత్తమ అంటుంది.
తప్పు నీ దగ్గర పెట్టుకొని పూజ చేయకూడదని ఎలా అంటావు తిలోత్తమ అని గురువుగారు అంటారు. నైని లాంతరు తీసుకొని వస్తుంది.తిలోత్తమని లాంతరు దగ్గరికి తీసుకెళ్లి తన తల సెగకు తగిలేలా పెట్టి గాయత్రి పాపతో ఆకులను తీయించాలని గురువుగారు చెప్తారు. గాయత్రి పాప ఆకులు తీస్తుంది. అనాధ పిల్ల అని చిన్నపిల్లని పేద పిల్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కానీ ఇప్పుడు మీకే సహాయం చేసింది అని విక్రాంత్ అంటాడు. చెడపకురా చెడేవు అని గుర్తు చేసుకోవాలి అని అంటుంది డమ్మక్క. అమ్మ నీ మొహం అంతా నల్లగా బొగ్గు లాగా తయారయింది అని అంటాడు వల్లభ. వాయిదా వేయడం ఎందుకు ఇంకొకసారి మనసులో ఉన్న కోరికనే బయటకి చెప్తే బాగుంటుందని నైని అంటుంది. వల్లభ తిలోత్తమ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు. ఏమైంది గాయత్రి దేవి జాడ తెలిసిందా అని అడుగుతాడు అఖండ స్వామి. మా అమ్మను అందరూ కలిసి జాడిస్తున్నారు స్వామి అని అంటాడు వల్లభ. రేయ్ నా పరువు తీయకు రా అని అంటుంది తిలోత్తమ.డాక్టర్ దగ్గర అయినా అబద్ధం చెప్పొచ్చు కానీ అఖండ స్వామి దగ్గర అబద్ధం చెప్పకూడదని నువ్వే చెప్పావు కదా అమ్మ అని అంటాడు వల్లభ.గాయత్రి అక్క చివరిగా కట్టుకున్న చీరతోనే నాకు గొంతు బిగించబోయారు స్వామి అని అంటుంది తిలోత్తమ.
మా ఆవిడ చంపబోయింది స్వామి అమ్మవారు పూనింది పెద్దమ్మ మార్నింగ్
చీరతో ఫ్యాన్ కి ఉరేయాలనుకుంది మా అమ్మ బరువు ఉంటుంది కాబట్టి పైకి ఎత్తలేదు అనుకుంటున్నాను స్వామి అని అంటాడు వల్లభ. తిలోత్తమ అఖండ స్వామికి పూజలో జరిగిన విషయం అంత చెబుతుంది. లాంతరు పెడితే గాని నాగవల్లి పత్రాలను నీ మొహం నుంచి వేరు చేయలేకపోయారు అని అడుగుతాడు అఖండ స్వామి. ఆ దత్తత తీసుకున్న పాప ఈరోజు కాపాడింది స్వామి అని అంటాడు వల్లభ. నువ్వు కోరుకున్న కోరిక ఆచరణీయం కాదు కాబట్టి అలా జరిగింది తిలోత్తమ అని అంటాడు అఖండ స్వామి. అలా కోరుకోకపోతే ఏదో ఒక రోజు గాయత్రి అక్క ఇంటికి వచ్చేస్తుంది నా ప్రాణాలు తీసేస్తుంది అని అంటుంది తిలోత్తమ. అది ఈ జన్మలో జరగని పని అని అంటాడు అఖండ స్వామి. పునర్జన్మ ఎత్తిన మా పెద్దమ్మ మా అమ్మని చంపడం ఫిక్సా అని అంటాడు వల్లభ.
ఒక్కసారి గాయత్రి అక్క నీడ కనబడ్డ చాలు ఇంకో జన్మ లేకుండా చేస్తాను అని అంటుంది తిలోత్తమ. నేను చెప్పినట్టు చేస్తే తనంతట తానే పునర్జన్మ చూపిస్తుంది అని అఖండ స్వామి చెప్తాడు. మీరు చెప్పింది చెప్పినట్టు జరిగితే నేను మీకు రుణపడి ఉంటాను స్వామి మీకు కృతజ్ఞతలు అని అంటుంది. తిలోత్తమ వల్లభ ఇంటికి వెళ్తారు. తిలోత్తమ గాయత్రీ దేవికి దండం పెట్టుకుంటానని అందరికీ చెప్తుంది. శత్రువులకు దండం పెడితే అది విజయం ఎలా అవుతుంది అది అపజయం అవుతుంది అని ఎద్దులయ్య అంటాడు. గాయత్రీ దేవి అక్క శత్రువు ఎలా అవుతుంది అని తిలోత్తమ అంటుంది. పెద్ద అత్తయ్య భర్తకు నువ్వు రెండో భార్య అయితే మీరిద్దరూ శత్రువులు కాక ఇంకేమవుతారు అని హాసిని అంటుంది. నాకు జ్ఞానోదయం అయింది ఒక్కసారి గాయత్రి అక్కకి దండం పెట్టుకుంటాను అని అంటుంది తిలోత్తమ.