Poonam Pandey: తాజాగా గర్భాశ్య క్యాన్సర్ ద్వారా పూనం పాండే చనిపోయింది అంటూ నిన్న అనేక వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక దీనిని ప్రతి ఒక్కరు నిజం అనుకుని నమ్మారు. ఇక ఇది అబద్ధమని తాజాగా పూనమ్ పాండే ఓ వీడియోని షేర్ చేసి తెలిపింది.
పూనం పాండే ఇదంతా గర్భాశయ క్యాన్సర్ అవేర్ నెస్ క్యాంపెయిన్ కోసమే చేశాను అంటూ తెలిపింది. ఇక దీనిని చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈమె చనిపోయినట్టు నిన్న ఈమె కుటుంబ సభ్యులు ఓ పోస్టర్ ని షేర్ చేశారు. ఇక ఈరోజు ఏమో ఈమె మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకి వచ్చి నేను చనిపోలేదు అని చెప్పింది.
ఇక దీంతో ప్రేక్షకులు బేభత్సంగా ఏకేస్తున్నారు. ఈమె వీడియోని చూసిన ప్రేక్షకులు..” మీకు ఇదంతా సరదాగా ఉందా. నిజంగా చనిపోయావని అందరూ అనుకున్నారు. మీరు ఏదైనా యాడ్ కి ప్రమోట్ చేయాలన్న ఆ వ్యాధి గురించి తెలపాలన్న వివరించండి.. అంతేకానీ ఇటువంటి సిల్లీ డ్రామాలు వేయకండి ” అంటూ మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం పూనమ్ పాండేకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇదంతా నటి నషా చేసినట్లు వెల్లడించింది.
POONAM PANDEY IS ALIVE!
It was just a publicity stunt to raise awareness about cervical cancer.#PoonamPandey https://t.co/SdXnfiGdu2 pic.twitter.com/QYpH6Y4Kvk
— TrackTollywood (@TrackTwood) February 3, 2024