Poonam Kaur: ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగంలో తళుక్కుమన్న తారలు ఇప్పుడు వరుసగా పలు రోగాలకు గురవుతున్నారు. విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. సమంత మయాసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి కోలుకోవడం జరిగింది. రీసెంట్ గా గర్భకోస క్యాన్సర్ కారణంగా బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే మరణించినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా.. ఆ రకంగానే వ్యాధి బారిన పడటం జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియజేయడం జరిగింది. ఇటీవల ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ మాట్లాడుతూ ఫైబ్రోమయాల్జియా అనే సమస్యతో రెండు సంవత్సరాలు బాధపడినట్లు తెలియజేసింది.
ఇది కూడా ఓ రకంగా మయోసైటీస్ లాంటిదే అని..ఫైబ్రోమయాల్జియా బాధితులు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారని శరీరం నిస్సత్తువుగా… అలసటతో పాటు నిద్రలేమి వల్ల సతమతమవుతారని చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి కారణంగా చేతులు కాలు పట్టేసేవని.. టైట్ గా ఉండే దుస్తులు ధరించలేక దాదాపు రెండు సంవత్సరాలు పాటు వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో న్యాచురోపతి లో పేరుగాంచిన మంతెన సత్యనారాయణను కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయని పూనమ్ కౌర్ స్పష్టం చేయడం జరిగింది. 2022 నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అప్పట్లో కేరళ ఆయుర్వేద ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకోవడం జరిగింది.
అయితే తర్వాత మంతెన సత్యనారాయణ సలహాలు కారణంగా చాలా వరకు నయమైందని తెలిపింది. అనంతరం ఈ వ్యాధికి సంబంధించి మంతెన సత్యనారాయణతో పూనమ్ కౌర్ ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఒకప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ అవకాశాలు లేక సైలెంట్ అయింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పరోక్షంగా కొంతమంది పార్టీ అధినేతలపై విమర్శలు చేసి ప్రముఖంగా నిలిచింది. ఇదే సమయంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ ప్రముఖ స్టార్ దర్శకుడు పై కూడా పరోక్షమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండేది. కెరియర్ పరంగా అవకాశాలు లేకపోవడంతో పూనమ్ కౌర్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!