NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రెడ్ల‌కు జ‌గ‌న్ – వైసీపీపై మోజు తీరిపోయిందా… ఎన్ని రెడ్డి వికెట్లు అంటే..!

నంద్యాల బై పోల్ టైంలో రాయ‌ల‌సీమ రెడ్లు అంద‌రూ ఏక‌మై ఈ ఉప ఎన్నిక‌ల్లో మ‌నోడిని ( జ‌గ‌న్‌ను) గెలిపించుకోవాలి.. ఇది మ‌న ప్రతిష్ట‌కు కీల‌కం అని ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఫ‌లితం వ్య‌తిరేకంగా వ‌చ్చింది. ఇక 2019 ఎన్నిక‌ల టైంలో మాత్రం సీమ రెడ్లు, కోస్తా రెడ్లు మాత్ర‌మే కాదు… తెలంగాణ‌లో రెడ్లు కూడా ఈ సారి మ‌న రెడ్డి వాడిని ముఖ్య‌మంత్రిని చేసుకోక‌పోతే మ‌న‌కు భ‌విష్య‌త్తు లేద‌ని అన్నీ ప‌ణంగా పెట్టేశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి రైతులు, దిగువ మ‌ధ్య త‌ర‌గతి రెడ్లు కూడా త‌మ స్తోమ‌త‌కు మించి వేలు, ఒక‌టి, అరా ల‌క్ష‌ల అప్పు చేసి పార్టీని గెలిపించుకునే క్ర‌మంలో త‌మ వంతుగా సాయం చేశారు.

అయితే ఇప్పుడు వారి ఆశ‌లు అన్నీ క‌రిగిపోయాయి. మ‌నోడు ముఖ్య‌మంత్రి అయితే మ‌న బ‌తుకులు బాగుప‌డ‌తాయి.. మ‌న ప్రాంతానికి మేలు జ‌రుగుతుంద‌ని ఆశించిన వారి ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. దీంతో మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద రెడ్ల‌లో కూడా జ‌గ‌న్ ప‌ట్ల వారి వైఖ‌రిలో బాగా మార్పు వ‌చ్చేసింది. వీళ్ల సంగ‌తి ఇలా ఉంటే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి బంప‌ర్ మెజార్టీల‌తో గెలిచిన రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జ‌గ‌న్ పేరు చెపితేనే భ‌య‌ప‌డిపోతున్నారు. కొంద‌రు అయితే ఈ సారి దండం పెట్టేసి పోటీకి దూరంగా ఉంటున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే వైసీపీలో ఉన్న రెడ్డి ప్ర‌జాప్ర‌తినిధులే కాదు.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల ప్ర‌జాప్ర‌తినిధులు కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టైంలోనే ఆనం, మేక‌పాటి, కోటంరెడ్డి పార్టీకి వ్య‌తిరేకంగా ఓటేసి జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక భావం చాటుకున్నారు. ఇక మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్‌లో చేరిపోయారు. కందుకూరు ఎమ్మెల్యే మ‌హీధ‌ర్ రెడ్డి త‌న దారి తాను చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఎంపీలు పార్టీని వ‌దిలేసేందుకు రెడీగా ఉన్నారు.

ఆ ముగ్గురు కూడా రెడ్డి సామాజికవర్గంలోని ప్రముఖులే కావడం గమనార్హం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి – నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి – రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిలో మాగుంట‌కు జ‌గ‌న్ సీటు ఇవ్వ‌న‌ని ఎప్పుడో చెప్పారు. వేమిరెడ్డికి నెల్లూరు సీటు ఇచ్చినా జ‌గ‌న్ తో వేగ‌లేక బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. విచిత్రంగా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి జ‌గ‌న్ నెల్లూరు రూర‌ల్ సీటు ఇచ్చారు. అయినా కూడా ఆయ‌న టీడీపీ లోకి వెళ్లేందుకు సిద్ధ‌మైపోయార‌ట‌.

వీరు మాత్ర‌మే కాదు.. జ‌గ‌న్ బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో పాటు క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల‌కు చెందిన రెడ్డి ప్ర‌జాప్ర‌తినిధులు కూడా రేపు టిక్కెట్లు ఎనౌన్స్ అయ్యాక బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీగా ఉన్నారు. విచిత్రం ఏంటంటే కొంద‌రు టిక్కెట్లు వ‌చ్చిన నేత‌లు కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఇప్ప‌టికే రెడ్డేత‌ర నేత‌ల్లో న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ లిస్టులో మ‌రికొంద‌రు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండ‌నున్నార‌ట‌.

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju